• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » తెలంగాణపై బీజేపీ దూకుడు రాజకీయం!

తెలంగాణపై బీజేపీ దూకుడు రాజకీయం!

Published on January 17, 2023 by Idris

Advertisement

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగాయి. ఈ ఏడాది జరిగే 9 రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ సాగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మీటింగ్ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు.

Advertisement

మోడీ స్ఫూర్తితో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు.పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న బీజేపీ కార్యకర్తలను మోడీ అభినందించారని చెప్పారు. ఆయన ఇచ్చిన జోష్ తో రాష్ట్రంలో మరింత ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశాల సందర్భంగా బండి స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Advertisement

ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశాన్ని కూడా దోపిడీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా కల్వకుంట్ల కుటుంబం ఫాంహౌస్ కు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాయకత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ తమను ఆదేశించారని చెప్పారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ కూడా కన్ఫామ్ అయింది. ఈనెల 28న ఆయన ఆదిలాబాద్‌ జిల్లాకు రానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల బలోపేతంపై దృష్టిపెట్టిన బీజేపీ.. తొలిసభను అక్కడినుంచే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కోర్‌ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే గ్రామగ్రామాన పార్టీ బలోపేతంపై మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. షా టూర్ తర్వాత మోడీ కూడా తెలంగాణ వచ్చే అవకాశం ఉంది.

Related posts:

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ? సిద్ధం కండి.. తెలంగాణ నేతలకు పవన్ పిలుపు..! కేసీఆర్ సర్కార్ కు మరో షాక్ తెలంగాణలో క్యాస్ట్ ఈక్వేషన్స్ పాలిటిక్స్..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd