• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » పవన్ తో చంద్రబాబు.. వైసీపీకి దడ మొదలైందా?

పవన్ తో చంద్రబాబు.. వైసీపీకి దడ మొదలైందా?

Published on October 18, 2022 by Sravan Kumar Sunku

Advertisement

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. అంతేకాదు.. భవిష్యత్ కార్యాచరణపై హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. విజయవాడలోని నోవాటెల్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు చంద్రబాబు. విశాఖ ఘటనల నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చ సాగింది. ప్రతిపక్షాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇరువురు మాట్లాడుకున్నారు.

Advertisement

Chandrababu, Pawan Kalyan

Chandrababu, Pawan Kalyan

భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఇద్దరు నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ వంటి నీచమైన పార్టీని తన జీవితంలోనే చూడలేదని అన్నారు. 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని.. అందరం కలుద్దామని పవన్ కల్యాణ్ ని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడదామన్నారు.

Advertisement

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలనూ కలుపుకెళ్తామని తెలిపారు. ముందుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ఆ తర్వాతే రాజకీయాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ప్రజా సమస్యలు ప్రస్తావించే పార్టీల గొంతు నొక్కేస్తే ఎలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్న పవన్‌.. జనసైనికులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

వీరిద్దరి భేటీతో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఈ రెండు పార్టీలు కలవడం ఖాయమని కథలు అల్లేస్తున్నారు. అయితే.. చంద్రబాబు, పవన్ వ్యాఖ్యల తర్వాత వరుసబెట్టి వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నారనేది అర్థం అవుతోందని విమర్శించారు. నిజానికి టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి భారీ నష్టం తప్పదు. 2014 ఎన్నికలే దీనికి ఉదాహరణ. 2019 సమయంలో వేర్వేరుగా పోటీ చేయడం వల్ల రెండు పార్టీలు నష్టపోయి వైసీపీకి లాభం చేకూరింది. చాలా చోట్ల టీడీపీ, జనసేన ఓట్లు కలిపితే వైసీపీకి వచ్చిన చాలా తక్కువగా అనిపించాయి. ఇప్పుడు మళ్లీ ఈ రెండు పార్టీలు కలిస్తే గనక జగన్ పార్టీకి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.

Also Read: వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్

Related posts:

ఇప్పుడు పవన్ రియాక్షన్ ఏంటో..! జగన్ కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు! వివేకా కేసులో కీలక పరిణామాలెన్నో.. త్వరలో రివీల్ అవుతుందా? Balineni Srinivasa Reddy On Janasena Allegationsమైత్రీ సంస్థలో బాలినేని పెట్టుబడులు.. నిజమేనా?

About Sravan Kumar Sunku

Content Writer at Telugu Action. Writes articles about the buzz happening around the film industry. 4 years of experience in movie industry and reporting field. and also working as SEO Analyst

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd