• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » మైత్రీ సంస్థలో బాలినేని పెట్టుబడులు.. నిజమేనా?

మైత్రీ సంస్థలో బాలినేని పెట్టుబడులు.. నిజమేనా?

Published on April 23, 2023 by Idris

Advertisement

ఈమధ్య కాలంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వందల కోట్లు పెట్టి అగ్ర నేతల సినిమాలను వరుసగా తెరకెక్కిస్తున్న మైత్రీ సంస్థ నిర్వాహకుల పెట్టుబడుల వ్యవహారంపై అధికారులు ఆరా తీశారు. మూడు రోజులపాటు వరుసగా ఈ సోదాలు జరిగాయి. అదే సమయంలో నిర్మాత ఎర్నేని నవీన్ అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే.. ఈ సంస్థలో రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

Advertisement

Balineni Srinivasa Reddy On Janasena Allegations

ప్రముఖంగా వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ లావాదేవీల విషయంలో బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులపై విచారణ జరిపించాలని కోరారు. సదరు నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలున్నాయని వివరించారు.

Advertisement

తనపై జరుగుతున్న ప్రచారంపై బాలినేని స్పందించారు. మైత్రీ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవమని అన్నారు. జనసేన కార్పొరేటర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. మైత్రీ సంస్థలో తనకు పెట్టుబడులున్నాయో? లేదో? పవన్‌ దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ, తాను డబ్బులు పెట్టానని నిరూపిస్తే.. ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు బాలినేని.

మైత్రీ సంస్థ నిర్మించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే పెట్టుబడులు పెట్టినట్టా? ఆ సినిమాకే కాదు ఏ మూవీ అయినా అవసరం అయితే సహకరిస్తానని తెలిపారు. తమపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తమ కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారని.. అవాస్తవాలు ప్రచారం చేయటం సరికాదన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

Related posts:

జగన్ పై రోజా ఇంట్రస్టింగ్ కామెంట్స్..! యువగళం @ 500 Pawan Kalyan With Formers Rights Organisationరైతులకు సాయంలో కూడా కులమేనా? chandrababu vs kodali naniచంద్రబాబు వర్సెస్ కొడాలి నాని.. ఇద్దరూ ఇద్దరే!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd