• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఆర్కేతో చంద్రన్నకు తలనొప్పి.. స్వారీ చెబితేనే పొత్తు అంటున్న పవన్.. ఏమైందంటే..?

ఆర్కేతో చంద్రన్నకు తలనొప్పి.. స్వారీ చెబితేనే పొత్తు అంటున్న పవన్.. ఏమైందంటే..?

Published on February 24, 2023 by mohan babu

Advertisement

ఆంధ్రజ్యోతి ఎండి టిడిపికి కాస్త వెన్నుదన్నుగా ఉంటారని టాక్ ఉంది.. సపోర్ట్ ఉంటారనే మాట తప్ప యాడ్లు ఇతరాత్ర విషయాల్లో తమను పీక్కు తింటున్నారని టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా అయినా సపోర్ట్ ఇస్తూ వస్తున్న నాయకులు ప్రస్తుతం వారి వాయిస్ మారుస్తున్నారు. రాధాకృష్ణతో మేలు కంటే కీడే ఎక్కువగా ఉందని చెప్పే నాయకులు ఎక్కువమంది ఉన్నారు. పార్టీ గెలిస్తే మా ప్రభావమే అంటూ, ఒకవేళ ఓడిపోతే మా సూచనలు సలహాలు చంద్రబాబు పాటించలేదంటూ చెప్పడం రాధాకృష్ణకు అలవాటైపోయింది. 20 సంవత్సరాల కాలంలో పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు బాగానే వర్కౌట్ చేసుకున్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

ALSO READ:“ఖుషి” సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

ఈ తరుణంలోనే వచ్చే ఎన్నికల్లో పొత్తు దిశగా టిడిపి జనసేన మద్య మంచి సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కథనంతో పవన్ కళ్యాణ్ మనస్థాపానికి గురయ్యారట. పవన్ తనతో కలిసి కానీ ఒంటరి పోరాటం కానీ చేస్తే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ 1000 కోట్ల రూపాయలు లంచం ఆఫర్ చేశారన్నదే ఈ కథనం సారాంశం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయంగా ఫెయిల్ అయ్యారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సొంతంగా ఎన్నికల్లో గెలిచే సామర్ధ్యం లేదని ఈ కథనం సూచించింది. అక్కడితో ఆగకుండా వద్దని ఒక కాపు సంఘం నేత వారించిన విషయాన్ని కూడా ఆర్కే ప్రస్తావించారు. దీనిపై పవన్ స్పందించలేదు కానీ మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఇలాంటి దిగజారుడు కథనాలతో మీకే నష్టమని చంద్రబాబు గట్టి సాంకేతాలు పంపారట.

Advertisement

ఈ కథనం వల్ల చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ మధ్య మాటలు కట్ అయినట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రాధాకృష్ణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. టిడిపిని ఎలాగైనా అధికారంలోకి తెచ్చేందుకు ఎంతటి పరిస్థితికైనా దిగజారుతాడు. ఈ క్రమంలోనే ఇలాంటి కథనం రావడం వల్ల చంద్రబాబే ఇదంతా చేయించారంటూ జన సైనికులు నమ్ముతున్నారు. కాబట్టి చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ కి సూచిస్తున్నారట. అంతేకాదు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆంధ్రజ్యోతి ఎండి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని జనసైనికులు. ప్రస్తుతం ఈ విషయం చంద్రబాబుకు పవన్ తో పొత్తు విషయంపై కాస్త తలనొప్పిని తెచ్చిందని చెప్పవచ్చు. రాధాకృష్ణ ఎండి క్షమాపణ చెబితేనే చంద్రబాబుతో మరో ముందడుగు వేయడానికి పవన్ బిస్మించుకూర్చున్నారట. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..

ALSO READ: ఆ తెలుగు హీరో రిజెక్ట్ చేయడంతో ధనుష్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి

Related posts:

Default Thumbnailజగన్‌ది 3 రాజధానుల సిద్ధాంతమైతే.. పవన్‌ ది మూడు పెళ్లిళ్ల సిద్ధాంతం వైసీపీ నేతలను చెప్పులతో కొడతా – పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు..జనసేన సైనికులు బానిసలే ? పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర? కాపు కాస్తున్న గుజరాత్ గూండాలు?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd