• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » లిక్కర్ కేసు.. ఎవరినీ వదలమంటున్న దర్యాప్తు సంస్థలు..!

లిక్కర్ కేసు.. ఎవరినీ వదలమంటున్న దర్యాప్తు సంస్థలు..!

Published on February 25, 2023 by Idris

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు దూకుడును కొనసాగిస్తున్నాయి. రోజుకో పరిణామంతో ఈ కేసు ఓ కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈమధ్యే ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తావన తీసుకొచ్చారు అధికారులు. అప్పటినుంచి కేసు మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటుండగా.. ముఖ్యమంత్రి పేరు కూడా తెరపైకి రావడంతో ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

ఈ కేసులో ఇప్పటిదాకా 9 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో ఆప్ తో సత్సంబంధాలు ఉన్న విజయ్ నాయర్ ఉన్నారు. అలాగే, సౌత్ గ్రూప్ గా చెబుతున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరు ఉన్నారు. అరెస్ట్ అయిన వారు బెయిల్ కోసం విశ్వ ప్రయాత్నాలు చేస్తుండగా.. అధికారులు మాత్రం వారిని వదలడం లేదు.

తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కస్టడీని పొడిగించాలని కోర్టును కోరారు సీబీఐ అధికారులు. శనివారంతో ఇంతకుముందు విధించిన కస్టడీ ముగియడంతో అతన్ని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని సీబీఐ అధికారులు వివరించారు. బుచ్చిబాబు కస్టడీ పొడిగించాలని కోరగా అందుకు అంగీకరించింది న్యాయస్థానం. మరో 14 రోజుల కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే. ఇతనికి ప్రముఖులతో పరిచయాలు ఉండడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఉంది. ఈనెల 8న విచారణ పేరుతో బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించుకుంది సీబీఐ. అదేరోజు రాత్రి అదుపులోకి తీసుకుంది. గతంలో సీబీఐ, ఈడీ బుచ్చిబాబును ప్రశ్నించాయి. ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం, అమలులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని అనుమానాలున్నాయి.

2021 జూన్‌ లో బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లైతో కలిసి ఢిల్లీలో విజయగౌరి అపార్ట్‌మెంట్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ తో చర్చలు జరిపారని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఐటీసీ కోహినూర్‌, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, తాజ్‌ మన్‌ సింగ్‌ హోటల్‌, ఒబెరాయ్‌ హోటల్‌ తదితర ప్రాంతాల్లో కూడా కీలక సమావేశాలు జరిగాయని తెలిపింది. మరోవైపు ఆదివారం సిసోడియాను అధికారులు విచారించనున్నారు.

Related posts:

కొత్త సీఎస్.. తెరపైకి ముగ్గురి పేర్లు..! బడ్జెట్ కలిపింది అందరినీ..! Minister KTR Counters To Bandi Sanjay and revanthబీఆర్ఎస్.. టార్గెట్ 100 KomatiReddy participated in the protest organized by Congress OBC wingరాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd