• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » అవినాష్ రెడ్డికి ఊరట.. హైకోర్టులో వాడీవేడి వాదనలు

అవినాష్ రెడ్డికి ఊరట.. హైకోర్టులో వాడీవేడి వాదనలు

Published on April 18, 2023 by Idris

Advertisement

సంచలనం రేపిన వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది. అయితే.. అనూహ్యంగా హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్​ ఇవ్వాలని అవినాష్ వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. వాదనల తర్వాత ఈనెల 25 వరకు అవినాష్ ​ను అరెస్ట్​ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. అయితే.. అప్పటిదాకా ప్రతిరోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

Advertisement

Don't Arrest Avinash Reddy Until 25th April  Telangana HC Orders to CBI

విచారణ సందర్భంగా ఇరు వర్గాల లాయర్ల మధ్య వాడీవేడి వాదనలు కొనసాగాయి. కోర్టులో అవినాష్ రెడ్డి, సునీత న్యాయవాదుల మధ్య పోటాపోటీ వాదనలు జరిగాయి. ఇంకా చెప్పాలంటే చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. రాజకీయ కారణాలతోనే ఈ కేసులో అవినాష్ ను ఇరికిస్తున్నారని.. హత్యతో సంబంధం ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారని ఆయన తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. పైగా, దస్తగిరి మీడియాతో మాట్లాడిన దాన్ని సునీత లాయర్ సమర్థించడమేంటని నిలదీశారు.

Advertisement

సునీత తరపు న్యాయవాది దీనిపై స్పందిస్తూ.. వివేకా హత్య రోజు అవినాష్ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్ ఆయన ఇంటికి వెళ్లారని… పైగా, గుండెపోటు అంటూ చిత్రీకరించేందుకు చూశారని కోర్టుకు తెలిపారు. ఎప్పుడు నోటీస్ ఇచ్చినా అరెస్ట్ చేయొద్దని అవినాష్ కోర్టుకెళ్తున్నారని, విచారణ అడ్డుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని వాదనలు వినిపించారు. ఇరు వాదనల తర్వాత అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ.. కొన్ని కండిషన్స్ పెట్టింది న్యాయస్థానం. ప్రతిరోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని… విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్​ చేయాలని ఆదేశించింది.

మరోవైపు వివేకా కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది న్యాయస్థానం. దీంతో బుధవారం నుంచి ఆరు రోజులపాటు ఇద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. అవినాష్ రెడ్డిని సైతం వారితో కలిపి విచారిస్తామని సీబీఐ వెల్లడించింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, ఆ తర్వాత చెంచల్​ గూడ జైలులో అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులకు కోర్టు స్పష్టం చేసింది.

Related posts:

కోటంరెడ్డి ఎంతకీ తగ్గడం లేదు! లోకేష్ యాత్రలో స్పెషల్ పర్సన్..! brs party working president ktr press meet at telangana bhavanఉక్కు నినాదం.. కేంద్రంపై బీఆర్ఎస్ కొత్త యుద్ధం RK Roja Strong Counter to Pawan Kalyan and Chandrababuచంద్రబాబు, పవన్ పై రోజా ఆగ్రహం

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd