• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » కేసీఆర్‌ పార్టీలో లుక లుకలు…టీఆర్‌ఎస్‌ నేతల ఆస్తులు జప్తు !

కేసీఆర్‌ పార్టీలో లుక లుకలు…టీఆర్‌ఎస్‌ నేతల ఆస్తులు జప్తు !

Published on October 18, 2022 by Bunty Saikiran

Advertisement

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌.. ప్రస్తుతం బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ.. జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే.. తన సొంత పార్టీ లీడర్లకు చిక్కులు వస్తున్నాయి. తాజాగా, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుకు ఈడి షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన రూ. 80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడి వెల్లడించింది.

Advertisement

గతంలో బ్యాంకు రుణాలు దారి మళ్లించిన ఆరోపణల మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఖమ్మం, హైదరాబాద్ సహా మొత్తం ఆరు చోట్ల సోదాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించింది. అలాగే రాంచి ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎంపీగా పనిచేసిన నామ గత ఎన్నికల్లో టిఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలుపొందారు. టిడిపి అధ్యక్షుడికి అత్యంత దగ్గర సన్నిహితుడుగా పేరుపొందిన నామ ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు.

Advertisement

ఇక అటు సిబిఐ కోర్టులో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైంది. ఓబులాపురం గనుల మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ లను సోమవారం సిబిఐ కోర్టు కొట్టి వేసింది. ఓఎంసి కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి అభ్యర్థనను కోర్టు త్రోసిపుచ్చింది. మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేసింది. ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి, పిఏ అలీ ఖాన్, రిటైర్డ్ అధికారులు కృపానందం, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లను సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం కేసుల అభియోగాల నమోదుపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. ఓఎంసి కేసు విచారణను వేగంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలనే ఆదేశించింది. దీంతో ఓబులాపురం గనుల మైనింగ్ కేసు విచారణ ప్రక్రియ వేగవంతమైంది.

READ ALSO : రాజకీయాలకు మంత్రి రోజా గుడ్ బై ?

Related posts:

Default Thumbnailపైలట్ రోహిత్ రెడ్డి సెక్యూరిటీ పై కెసిఆర్ సంచలన నిర్ణయం ! రాహుల్ గాంధీ కోసం టాలీవుడ్ బ్యూటీ Default Thumbnailకేసీఆర్‌ “చాణక్యం”..ఈటలకు డిప్యూటీ సీఎం ? Default Thumbnailఅసెంబ్లీ టికెట్‌ కోసం కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నాడుగా !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd