Advertisement
వేల కోట్ల రూపాయలు అప్పులు గా చేసి ప్రస్తుతం విదేశాల్లో తల దాచుకుంటున్న “విజయ్ మాల్యా” గురించి అందరికి తెలిసిందే..! ఇప్పటికే ఈయన ఆస్తులు అన్ని బ్యాంకులు వేలం పాట వేస్తున్నారు. అలానే 2021 లో ముంబై ఎయిర్ పోర్ట్ కి అతి సమీపం లో గల “కింగ్ ఫిషర్ హౌస్” సుమారు 52 కోట్ల రూపాయలకి వేలం పాటలో సొంతం చేసుకున్నారు హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపార వేత్త ‘సంధ్య కన్వెన్షన్ ఎండీ సరనాల శ్రీధర్ రావు‘.
Advertisement
Advertisement
About Saranala Sridhar Rao
Sandya Sridhar rao
శ్రీధర్ రావు హైదరాబాద్ లోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యాపార వేత్త, శ్రీధర్ రావు గారి స్వస్థలం విజయవాడ .. వృత్తి వ్యాపార రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
Sandya Sridhar rao
అంతే కాదు .. హైదరాబాద్ మొత్తానికి 23 సూపర్ స్పోర్ట్స్ కార్లు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి ఈయనే. యావత్ ప్రపంచాన్ని చిన్నా బిన్నం చేసిన కోవిడ్ మహమ్మారి విజృభిస్తున్న సమయంలో తనవంతు సహాయంగా సుమారు పది కోట్ల రూపాయల వరకు పేదలకు అందించారు.