• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసిన వేళ..!

కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసిన వేళ..!

Published on January 20, 2023 by Idris

Advertisement

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. అధ్యక్ష పదవి దగ్గర మొదలైన వైరం.. ఎన్నో విషయాల్లో విభేదాలను బయటపెట్టింది. ఒకటి, రెండు సందర్భాల్లో వీళ్లిద్దరూ కలిసినా.. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన దగ్గర నుంచి దూరం బాగా పెరిగింది. పైగా కొందరు నేతలు అత్యుత్సాహంతో కోమటిరెడ్డిని టార్గెట్ చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. క్రమంగా.. రేవంత్, వెంకట్ రెడ్డి వర్గాలుగా గొడవలు జరిగాయి.

Advertisement

అయితే.. శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరి చేతిలో చెయ్యేసుకుని మాట్లాడుతూ కనిపించారు. పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్ రెడ్డి గాంధీ భవన్ కు కూడా వెళ్లారు. అక్కడే ఈ దృశ్యం కనిపించింది. ఇద్దరు నేతలు ఒకరినొకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు థేక్రే నగరానికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకే కోమటిరెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు.

Advertisement

పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి తన వంతు సహకారం అందిస్తానని.. తనకున్న సూచనలను అందిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈనెల 26 నుంచి నిర్వహించబోయే పార్టీ కార్యక్రమాల్లో, హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. మాణిక్ రావు థాక్రేతో ఒంటరిగా భేటీ అయ్యారు వెంకట్ రెడ్డి. పార్టీలోని సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గత విషయాలను పక్కనపెట్టి పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరినట్లు తెలిపారు. 50 శాతం టికెట్స్ ముందే ఇవ్వాలని చెప్పానన్నారు. నియోజకవర్గాల్లో ఎక్కువ పోటీ ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడాలని సూచనలు చేశానని చెప్పారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలా అనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

‘‘పార్టీలో గౌరవం దక్కాలి. అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పని చేస్తా. పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రజల మనసులో ఉంది’’ అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Related posts:

కాంగ్రెస్ నేతల్ని వెంటాడుతున్న కేసు..! విజయశాంతి పాలిటిక్స్ @ 25 గవర్నర్ ను అంత మాటంటారా? లీకేజ్ మంటలు.. కాంగ్రెస్ ఫిర్యాదుపై గవర్నర్ ఏం చేయనున్నారు?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd