• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » జగన్ పాలనపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పాలనపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Published on January 29, 2023 by Idris

Advertisement

మద్యపాన నిషేధం చేసిన తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జనం ముందుకు వస్తారని అడిగారు టీడీపీ నేత నారా లోకేష్. పార్టీ శ్రేణులు, జనసందోహం నడుమ మూడోరోజు పాదయాత్రను ముగించారు. ఇందులో భాగంగా మాట్లాడిన లోకేష్.. మందుబాబులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. ఆయన సతీమణి భారతి రెడ్డి.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు.. ఇప్పుడు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. అరకొరగా ఇచ్చే అమ్మఒడి కూడా ఏడాది ఎగ్గొట్టారని ఆరోపించారు.

Advertisement

45 సంవత్సరాలకే మహిళలకు పెన్షన్ అని చెప్పిన జగన్‍ ఇస్తున్నారా? అని అడిగారు లోకేష్. జగన్‌ అధికారంలోకి రాగానే వ్యవసాయ సబ్సిడీలు ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతులు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఏపీ చరిత్రలో ఇది ఎన్నడూ ఇది జరగలేదని.. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతులకు ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాగానే రైతులకు సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీ లోన్‌ లు కూడా అందిస్తామని తెలిపారు.

Advertisement

గతంలో టీడీపీ అందించిన ప్రతి పథకాలను మళ్లీ తీసుకొస్తామన్నారు లోకేష్. చిన్న, సన్నకారు రైతులకు లోన్‌ లు రావడం చాలా కష్టతరమైందని చెప్పారు. కోర్టులో చోరీ చేసిన వ్యక్తి వ్యవసాయశాఖ మంత్రి కాకాణి అని విమర్శించారు. ఇలాంటి దొంగలకు, దొంగ ప్రభుత్వానికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలంటూ జాదూ మంత్రాలతో మోసం చేస్తున్నారని.. గత పాలనలో ఏపీని రైతు రాజ్యం అనేవారని, ఇప్పుడు రైతేలేని రాజ్యంగా జగన్‌ రెడ్డి మార్చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

కర్ణాటకలో లీటర్‌ డీజిల్ రూ.88, పెట్రోల్ రూ.102 ఉంటే.. ఏపీలో లీటర్‌ డీజిల్ రూ.99.27, పెట్రోల్ రూ.111.50 ఉందన్నారు లోకేష్. పెట్రోల్, డీజిల్‌ పై పన్ను బాదుడులో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని చురకలంటించారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల పన్నులతో ప్రజలను జగన్‌ రెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో పెట్రోల్ ధరలపై జగన్‌ రెడ్డి బాదుడే బాదుడని సెటైర్లు వేశారు లోకేష్.

Related posts:

మంగ్లీతో జగన్ కు చిక్కులు! వారాహిపై పవన్.. చేతిలో గద.. పిక్స్ వైరల్..! Roja, Anita dialogue warలేడీ లీడర్ల డైలాగ్ వార్ Janasena Chief Pawan Kalyan Busy in Delhi Tourహస్తినలో జనసేనాని రాజకీయాలు

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd