• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » పట్టపగలు రెచ్చిపోయిన వన్ సైడ్ లవర్.. ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని తెలిసి..!!

పట్టపగలు రెచ్చిపోయిన వన్ సైడ్ లవర్.. ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని తెలిసి..!!

Published on December 25, 2022 by anji

Advertisement

ప్రేమ అంటే ఒక మధురానుభూతి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో బయట ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వారి ప్రేమను అంగీకరించకపోవడంతో కొందరు ప్రేమికులు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ వన్ సైడ్ లవర్ నడిరోడ్డుపై కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దేవనగెరే ప్రాంతంలో సుల్తానా అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అదే ప్రాంతంలో సాధత్ అలియాస్ చాంద్ పీర్ అనే యువకుడు కూడా నివాసం ఉంటున్నాడు.

Advertisement

Read also: కమెడియన్ అలీ ఫస్ట్ లవ్ స్టోరి తెలుసా.. ఎలా బ్రేకప్ అయ్యిందంటే..?

Advertisement

అయితే గత కొంతకాలంగా సుల్తానాని ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడ్డాడు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేశాడు. అతని ప్రేమను ఆ యువతి అంగీకరించలేదు. దీంతో అతను ఏకంగా సుల్తానా ఇంటికి వెళ్లి మీ కూతురిని పెళ్లి చేసుకుంటానని కోరాడు. దీనికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంకోసారి తమ కూతురి వెంటపడితే పోలీసు కేసు పెడతామని సుల్తానా తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా వినకుండా చాంద్ పీర్ ఆ యువతి వెంటపడేవాడు. ఈ క్రమంలో సుల్తానాకు ఆమె తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం చేయాలని నిశ్చయించారు.

ఈ విషయం తెలుసుకున్న చాంద్ పీర్ ప్రియురాలిపై కోపంతో రగిలిపోయాడు. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటీవల కాపు కాసి పట్టపగలుగా యువతి వెళుతున్న క్రమంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సుల్తానా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం బైక్ పై అక్కడి నుంచి పారిపోయాడు చాంద్ పీర్. దీంతో వెంటనే స్పందించిన యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం యువతీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తర్వాత సాదత్ అలియాస్ చాంద్ పీర్ కూడా విషం తాగి ఆ****యత్నం చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Read also: రూ.400 కోట్లు సంపాదించి పెట్టిన కాంతారా నుండి రిషబ్ శెట్టికి మిగిలింది ఇంతేనా?

 

Related posts:

ప్రధాని మోడీకే షాకిచ్చిన సీఎం..! Janasena Chief Pawan Kalyan Busy in Delhi Tourమూడో ఏడాది.. పవన్ కోటి రూపాయల విరాళం! వివేకా మర్డర్ కేసు.. వైసీపీ ‘కవర్ డ్రైవ్’? ఎవ్వర్నీ వదలం.. భయపెడుతున్న ఎలుకలు!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd