• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » వివాదాస్పద రిషికొండ దగ్గర పవన్..!

వివాదాస్పద రిషికొండ దగ్గర పవన్..!

Published on November 12, 2022 by Idris

Advertisement

సీఎం జగన్ విశాఖ బహిరంగ సభలో ఉండగానే జనసేనాని పవన్ పోరాటం మొదలు పెట్టారు. జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా ఫైట్ కు శ్రీకారం చుట్టారు. జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు అంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. జగనన్న కాలనీల్లో అనేక అరాచకాలు జరిగాయని జనసేన మొదట్నుంచి విమర్శిస్తోంది. లబ్ధిదారుల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని.. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని అంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.

Advertisement

ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాత రోజే ఈ కార్యక్రమం స్టార్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు విశాఖ పర్యటనలో ఉన్న పవన్ సడెన్ గా సాగర తీరంలో కనిపించారు. ఉదయం నుంచి పార్టీ నేతలతో భేటీ అయిన పవన్.. సాయంత్రానికి బీచ్ లో దర్శనమిచ్చారు. కాసేపు వాకింగ్ చేశారు. ఓ మత్స్యకారుడు కనిపిస్తే కాసేపు మాట్లాడారు.

Advertisement

పవన్ బీచ్ కు వెళ్లారని తెలియడంతో మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. తర్వాత విషయం అభిమానులకు తెలియడంతో జనం తాకిడి పెరిగింది. దీంతో ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. దారిపొడవునా జనం ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక అక్కడినుంచి పవన్ వివాదాస్పద రిషికొండను పరిశీలించారు. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల చుట్టూ బారికేడ్లు అడ్డుగా ఉండడంతో.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకూడదనే ఇలా చేశారని అన్నారు జనసేనాని. రుషికొండను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించామని చెప్పారు.

చాలా రోజుల నుంచి విశాఖ రుషికొండ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ధ్వంసం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. అలాంటిదేం లేదని వైసీపీ చెబుతూ వస్తోంది. కానీ, ప్రతిపక్షాలను మాత్రం రుషికొండను పరిశీలించేందుకు అనుమతించడంలేదు. ఇటీవల టీడీపీ నేతలు తవ్వకాలను పరిశీలించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు పోలీసులు. పవన్ ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా రుషికొండ తవ్వకాలపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా తవ్వకాలను పరిశీలించారు.

Related posts:

డైమండ్ రాణి వ్యాఖ్యలపై హర్టయిన రోజా.. లోకేష్ ని అంత మాట అనేశారేంటి? Janasena Chief Pawan Kalyan Busy in Delhi Tourమూడో ఏడాది.. పవన్ కోటి రూపాయల విరాళం! వివేకా మర్డర్ కేసు.. వైసీపీ ‘కవర్ డ్రైవ్’? CM KCR Master Plan For Vishaka Steel Plantబీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ నినాదం లాభమా? నష్టమా?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd