• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » అగ్నిపథ్ రద్దు.. జరిగే పనేనా?

అగ్నిపథ్ రద్దు.. జరిగే పనేనా?

Published on November 4, 2022 by Idris

Advertisement

మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్. భారత సైన్యంలో యువతకు మరిన్ని అవకాశాలు దక్కేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. అగ్నిపథ్‌ లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును బట్టి 25 శాతం మందిని రిటెయిన్ చేసుకుంటారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.

Advertisement

ఈ పథకానికి మొదట్నుంచి వివాదాలు చుట్టుకున్నాయి. పాత పద్దతిలోనూ రిక్రూట్ మెంట్ జరగాలని దేశవ్యాప్తంగా యువత ఆందోళన బాటపట్టారు. బస్సులు, రైళ్లను తగులబెట్టారు. ప్రభుత్వ ఆస్తి నష్టం భారీగానే జరిగింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. ఈ పథకం కింద రిక్రూట్ మెంట్ మొదలవ్వగానే భారీగా అప్లికేషన్లు వచ్చాయి.

Advertisement

అయితే.. ఈ అగ్నిపథ్ ను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఆపార్టీ నేత ప్రియాంక గాంధీ ప్రకటించడం సంచలనంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికార పగ్గాలను చేబడితే దేశ యువతకు వ్యతిరేకంగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు ప్రియాంక. అగ్నిపథ్ ను రద్దు చేయాలని విపక్షాలు కోరినా బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

హిమాచల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రాష్ట్రంలో 5 లక్షలమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ గెలిస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని వాగ్దానం చేశామని.. అది అమలవుతోందని వివరించారు. నిధుల కొరత వల్ల హిమాచల్ లో పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఇది కుంటి సాకు మాత్రమేనని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

Related posts:

చదివింది 8వ తరగతి.. కానీ డజను మంది మహిళలకు టోకరా..!! Default Thumbnailపిల్లలను స్కూటీపై ముందు కూర్చోపెడుతున్నారా? అయితే జాగ్రత్త..!! పొరపాటున కూడా ఈ వస్తువులు రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!! ఏపీలో బాబుల పంచాయితీ..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd