• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » రాజీవ్ హంతకులకు స్వేచ్ఛ.. కాంగ్రెస్ ఏమంటోంది..?

రాజీవ్ హంతకులకు స్వేచ్ఛ.. కాంగ్రెస్ ఏమంటోంది..?

Published on November 11, 2022 by Idris

Advertisement

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరి విడుదలపై తమిళనాడు ప్రభుత్వం గతంలోనే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో గుర్తు చేసింది.

Advertisement

నిందితుల విడుదలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇది అంగీకారయోగ్యం కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఈ తీర్పు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీం నిర్ణయాన్ని తమ పార్టీ విమర్శిస్తోందని తెలిపారు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు భారతదేశ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించలేదని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Advertisement

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాజీవ్ గాంధీ. ఆ సమయంలో ఆయనపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను అనే మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులో పెరరివాలన్, నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌ ను దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే.. ఆ మరుసటి ఏడాది పెరరివాలన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. జీవిత ఖైదుగా తగ్గిస్తూ గతంలో కోర్టు తీర్పునిచ్చింది.

ఈ కేసులో పెరరివాలన్ అనే నిందితుడు గత మే నెలలో రిలీజయ్యాడు. అతని మాదిరే తమను కూడా విడుదల చేయాలని నళిని, రవిచంద్రన్ లోగడ మద్రాస్ హైకోర్టును కోరారు. అయితే, కోర్టు వీరి అభ్యర్థనను నిరాకరించింది. రాజ్యాంగంలోని 142 అధికరణం కింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలు తమకు లేవని, అందువల్ల మీ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నామని పేర్కొంది. దోషుల రిలీజ్ పై తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేసింది. వీరికి క్షమాభిక్షకు సంబంధించి.. అది గవర్నర్ విచక్షణాధికారాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తూనే ఏడుగురు దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్లను ప్రభుత్వం పరిశీలించింది. పెరరివాలన్ విడుదల అనంతరం రవిచంద్రన్ తమను కూడా రిలీజ్ చేయాలని కోరుతూ గతంలో సీఎం స్టాలిన్ కి లేఖ రాశాడు. ఇదే క్రమంలో దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts:

తెలంగాణలో క్యాస్ట్ ఈక్వేషన్స్ పాలిటిక్స్..! కవితకు ఈడీ పిలుపు.. ఆమె ఏమన్నారంటే? కరీంనగర్ కవాతు.. టార్గెట్ బీఆర్ఎస్! ఇంస్టాగ్రామ్ లో అసభ్యకర మెసేజ్ పెట్టిన యువకుడు.. అడ్రస్ కనుక్కొని వచ్చి మరీ చెప్పుతో కొట్టిన యువతి..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd