• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » రోడ్డెక్కిన టీచర్లు.. సర్కార్ పై రాములమ్మ సెటైర్లు..!

రోడ్డెక్కిన టీచర్లు.. సర్కార్ పై రాములమ్మ సెటైర్లు..!

Published on January 22, 2023 by Idris

Advertisement

జీవో 317 మరోసారి చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల బదిలీలపై ఉపాధ్యాయులు మరోమారు రోడ్డెక్కడమే అందుకు కారణం. జీవో 317ను సవరించి.. ఎవరి స్థానిక జిల్లాకు వారిని కేటాయించాలని డిమాండ్ తో ప్రగతి భవన్ ముట్టడికి విడతలవారీగా ప్రయత్నిస్తున్నారు టీచర్లు. చిన్నారులను వెంట తీసుకుని రెండురోజులపాటు ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ కు తరలించారు.

Advertisement

ఇటు ఇంతకుముందే అరెస్ట్ అయిన వారు.. గోషామహల్ గ్రౌండ్ లో చిన్నారులతో కలిసి ఆందోళన కొనసాగిస్తున్నారు. జీవో వల్ల పడుతున్న బాధను కేసీఆర్ కు చెప్పుకునేందుకు ప్రగతి భవన్ ​కు వెళితే.. పోలీసులు తమపై, తమ పిల్లలపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. 317 జీవోతో తాము నరకం అనుభవిస్తున్నామని వాపోయారు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారని.. కానీ ఇప్పుడెందుకు చూడటం లేదని ప్రశ్నిస్తున్నారు టీచర్లు.

Advertisement

ఈ ఇష్యూపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. జీవో నెంబర్ 317తో పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టి, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలను ఒకరికొకరు కాకుండా చేస్తూ, వారి పిల్లలకు సైతం అన్యాయానికి గురి చేసిన కేసీఆర్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తమ స్థానికతను లాగేసుకోవడం తగునా? అని ప్రశ్నించారు. అసలే ఆవేదనలో ఉన్న టీచర్లను పిల్లలతో సహా పోలీసులు స్టేషన్‌ కి తరలించడం మరింత అమానుషమని మండిపడ్డారు.

ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కేసీఆర్ జాతీయ స్థాయిలో ఇంకెలా వెలగబెడతారో చెప్పాల్సిన పని లేదన్నారు విజయశాంతి. ఈ జీవో వల్ల చోటు చేసుకున్న అర్థం పర్ధం లేని బదిలీల వల్ల ప్రతిరోజూ వందలాది కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాల్సి వస్తోందని.. టీచర్లు ఆర్థికంగా కూడా చితికిపోతున్నారని వివరించారు. పిల్లల్ని చంకనేసుకుని వచ్చిన తల్లిదండ్రులు ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధపడ్డరని.. ఈ జీవోకి తగిన సవరణలు చెయ్యాలని లేదా రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు విజయశాంతి.

Related posts:

కొత్త సీఎస్.. తెరపైకి ముగ్గురి పేర్లు..! మీడియా ముందే బోరున ఏడ్చేసిన మహిళా నేత..! బడ్జెట్ లో తెలంగాణ కేటాయింపులివే.. నాయకుల స్పందన ఇదే..! Minister KTR Counters To Bandi Sanjay and revanthబీఆర్ఎస్.. టార్గెట్ 100

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd