• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » Ap Assembly Session Updates: అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు!

Ap Assembly Session Updates: అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు!

Published on March 20, 2023 by Idris

Advertisement

Ap Assembly Session Updates: ఏపీ అసెంబ్లీలో ఎలాంటి మార్పు లేదు. అవే నిరసనలు.. అవే సస్పెన్షన్లు.. కాకపోతే ఎమ్మెల్యేలు కాస్త దూకుడు పెంచారు. కొట్టుకునే వరకు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి టీడీపీ సభ్యులు ఏదో ఒక అంశంపై నిరసన వ్యక్తం చేయడం.. స్పీకర్ వారిని సస్పెండ్ చేయడం కామన్ గా జరుగుతూ వస్తోంది. సోమవారం కూడా అదే సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన కాసేపటికే ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

Tension Situation In AP Assembly Session

జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చింది టీడీపీ. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. జీవో నంబర్‌ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్‌ దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు.. అయితే, ఈక్రమంలోనే ఘర్షణ మొదలైంది.

Advertisement

స్పీకర్ ముఖంపై ప్లకార్డును పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా.. స్పీకర్ తమ్మినేని దానిని పక్కకు తోశారు.. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే.. స్పీకర్‌ తో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లారు. సుధాకర్‌ బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పోడయం దగ్గరకు వెళ్లగా.. అక్కడే.. ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

పరస్పరం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుకున్నారు. తమ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు దాడి చేశారని టీడీపీ నేతలు అంటుంటే.. తనపైనే దాడి జరిగిందని సుధాకర్ గాయాన్ని చూపిస్తున్నారు. 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అయినా, వారు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ తో బయటకు పంపించారు.

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ ఆపార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలోనే ఈ రోజు చీకటి రోజని దుయ్యబట్టారు. సభలో ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ జరగలేదని.. ముఖ్యమంత్రి జగన్ ప్రోద్భలంతోనే దళిత సభ్యుడు స్వామిపై దాడి చేశారని మండిపడ్డారు. చట్టసభకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా సీఎం జగన్ కచ్చితంగా నిలిచిపోతారని అన్నారు చంద్రబాబు.

Related posts:

రోజాపై నాగబాబు సెటైర్.. మామూలుగా ఇవ్వలేదు..! బీజేపీకి కన్నా గుడ్ బై.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..? ఇప్పటంలో మళ్లీ.. ఈసారి ఏం జరగనుంది..? Pawan Kalyan Gives Clarity on Political Alliance in APపవన్ సరికొత్త వ్యూహాలు.. యథావిధిగా వైసీపీ ఎటాక్!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd