• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » హిందూ సంప్రదాయం ప్రకారం చేతులకు ఎరుపు, పసుపు, నారింజ రంగు దారాలు ఎందుకు కడతారో తెలుసా?

హిందూ సంప్రదాయం ప్రకారం చేతులకు ఎరుపు, పసుపు, నారింజ రంగు దారాలు ఎందుకు కడతారో తెలుసా?

Published on June 30, 2022 by Bunty Saikiran

Advertisement

మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. లెక్కబెట్టలేని విధంగా దేవాలయాల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అయితే… మన దేశంలోని ప్రతి దేవాలయాల్లో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలు గా భక్తులు ధరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు? ఆ మౌళి చేతికి కంకణంగా ఎందుకు ధరిస్తారు? అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? దాన్ని ఎందుకు కడతారో తెలుసుకుందాం.

Advertisement

Also Read:  RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

బలిచక్రవర్తి కథ తెలుసుకుంటే మౌలి గురించిన వివరణ తెలుస్తుంది. బలి చక్రవర్తిని అంతమొందించేందుకు శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తాడు అన్న విషయం మనకు తెలిసిందే. బలి నిజానికి అసురుడే అయినా దానాలు చేయడంలో చాలా గొప్పవాడు. బలి చక్రవర్తి తన వద్దకు వచ్చిన వామనుడిని చూసి ఏం కావాలో కోరమంటాడు. దానికి వామనుడు మూడు అడుగుల స్థలం కావాలని అడుగుతాడు. వామనుడు ఒక అడుగును భూమిపై, మరో అడుగును ఆకాశంపై పెడతాడు. ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏ మాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమని అంటాడు.

Advertisement

ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?

దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతడు పాతాళంలోకి పోతాడు. దీంతో బలి దానగుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడుగా ఉండేలా వరమిస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్నికడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు. అలా మౌళి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి లు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకనే మౌళి దారాలను కడతారు. ఇది ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశమన్న మాట.

Also Read:  హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!

Related posts:

తొలి ఏకాదశి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు.. లేదంటే..? కాళ్ళకు నల్ల దారం కట్టుకోవడం వల్ల జరిగే పరిణామాలు! శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం ఈ పూజ చేస్తే అష్టైశ్వర్యాలే..!! dhanalaxmiధన లక్ష్మి నిత్యం ఇంట్లో ఉండాలంటే ఏమి చేయాలి ? ఏమి పాటించాలి ?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd