• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?

రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Published on March 29, 2023 by sasira

Advertisement

పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అయితే.. ఈ ఇష్యూను ప్రస్తుతానికి కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నా.. రాహుల్ కు ఊరట కలిగే అంశాలే ఎక్కువ ఉన్నాయనేది విశ్లేషకుల వాదన. తాజాగా లక్ష్యద్వీప్ నేత కేసులో జరిగినది ఉదాహరణగా చూపిస్తూ.. రాహుల్ సభ్యత్వం కూడా పునరుద్ధరణ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

రాహుల్ మాదిరిగానే లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ అనర్హత వేటును ఎదుర్కొన్నారు. 2009 లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్‌ పై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న ఆయనను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తరువాత జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది.

Advertisement

ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపి వేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. విచారణకు ముందే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది లోక్ సభ సచివాలయం.

Advertisement

ఇప్పుడు రాహుల్ గాంధీ ఇష్యూలో కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఆశగా కనిపిస్తున్నారు ఫైజల్. రాహుల్ ను పైకోర్టుకు వెళ్లమని సూరత్ కోర్టు తెలిపింది. తనపై పడిన శిక్షను సవాల్ చేస్తూ పైకోర్టుకు ఆయన వెళ్లొచ్చు. పై కోర్టులు శిక్షను ఒక్కరోజు తగ్గించినా.. సూరత్ కోర్టు తీర్పును నిలిపివేసినా.. లేదా శిక్షను పూర్తిగా రద్దు చేసినా.. ఆయనపై పడ్డ అనర్హత తొలగిపోతుంది. దీంతో లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణ అవుతుంది. పై కోర్టుల్లో రాహుల్​కు ఊరట లభించకపోతే మాత్రం పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ, అలా జరిగే అవకాశాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Related posts:

సీఎం జగన్ ఓ నరరూప రాక్షసుడు? క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం ! మిస్టరీ.. వాళ్లంతా ఎందుకు పడిపోయారు? Default Thumbnailఇంత దారుణమా.. కేవలం ఉల్లిపాయ ముక్కల కోసం పానీపూరీ బండి దగ్గర రచ్చ !

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd