• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » పైరవీలకే పెద్దపీట..!

పైరవీలకే పెద్దపీట..!

Published on December 20, 2022 by sasira

Advertisement

ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కోమటిరెడ్డి నల్గొండలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కమీటీల్లో గాంధీభవన్ లో ఉంటూ పైరవీలు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో పరిణామాలపై దిగ్విజయ్ ను నియమించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.

కాంగ్రెస్ లో మార్పు వస్తుంద‌ని ఆశిస్తున్నట్లు చెప్పారు వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా డిగ్గీరాజాకు కొన్ని సూచనలు చేశారు. హుజూరాబాద్ లో రేవంత్ ఎందుకు ప్రచారానికి వెళ్లలేదో తేల్చాలన్నారు. మునుగోడులో తనను తిట్టిన ఇష్యూపై విచారణ జరపాలని కోరారు. కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదని.. మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలని తెలిపారు.

Advertisement

సీనియర్లకు అన్యాయం జరిగిందన్న కోమటిరెడ్డి.. అధిష్టానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ వచ్చిందన్నారు. దిగ్విజయ్ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నేత అని కొనియాడారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉందన్నారు. కమిటీల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఈ విషయంపై ఆయన దృష్టి సారించాలని కోరారు.

Advertisement

ఇక కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు వెంకట్ రెడ్డి. తెలంగాణలో కనీసం మౌలిక సదుపాయాలు లేవన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని.. ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ అమలు అవుతోందని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో స్కూళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు.

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd