• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » వీరసింహారెడ్డిలో ఆ పంచ్ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!! ఆ డైలాగ్ ఏంటంటే..?

వీరసింహారెడ్డిలో ఆ పంచ్ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!! ఆ డైలాగ్ ఏంటంటే..?

Published on March 8, 2023 by karthik

Advertisement

నటసింహా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అంటే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసేది అందులోని పంచ్ డైలాగుల కోసమేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా బాలకృష్ణ ” వీర సింహారెడ్డి” చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ రెండు వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నిర్మాతలు నవీన్ యుర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.

Read also: చిరంజీవి మాస్టర్ సినిమాలోని హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఈ చిత్రంలోని పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సాధించింది. అయితే ఈ మూవీలోని ఓ పంచ్ డైలాగ్ ని రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టారని నెటిజెన్లు, నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. ” సినిమాలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు, మందు తరాలు నాకిచ్చిన బాధ్యత, నాది ఫ్యాక్షన్ కాదు, సీమ మీద ఎఫెక్షన్..!” అంటూ బాలయ్య చెప్పిన ఈ భారీ డైలాగ్ వినడానికి చాలా బాగుంది.

Advertisement

ఈ డైలాగ్ ని ట్రైలర్ లో కూడా పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాపై హైప్ పెరగడానికి ఈ డైలాగ్ కూడా కారణమని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ మొదలైనప్పుడు రావలసిన ఈ డైలాగ్ ని ఎక్కడో చివర్లో ఇరికించడం బాలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో విలన్ తండ్రితో ఫైట్ చేసే సమయంలో బాలయ్య.. ” రేపటి తరం కూడా నీ చావుని కోరుకుంటుంది ” అంటూ విలన్ కు తనను పరిచయం చేసుకుంటాడు. ఆ సమయంలో ఈ ట్రైలర్ లో ఉన్న డైలాగ్ పెడితే బాగుండేదని.. కానీ చివర్లో చిన బాలయ్య వద్ద ఇరికించారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

Read also: అప్పుడు తొడ కొడితే ట్రైన్ వెనక్కి, ఇప్పుడు వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!

Veera Simha Reddy:’వీరసింహారెడ్డి’ లో ఆ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!

Advertisement

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd