• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » “శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి” వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

“శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి” వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

Published on December 8, 2022 by karthik

Advertisement

కలియుగం అంతం సమీపించే కొద్దీ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆచారాలకు విలువ లేకుండా పోతుందని, ఎన్నో ఉపద్రవాలు చోటు చేసుకుంటారని ఆయన చెప్పారు. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 – 12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. అందువల్ల ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు.

Read also: ఇల్లు మారేటప్పుడు ముందుగా ఈ వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలి

Advertisement

అలాగే కోరంకి జబ్బుతో కోటి మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది. ఆయన చెప్పినట్లే కరోనా రావడంతో లక్షల్లో మరణాలు సంభవించడం జరుగుతోంది. ప్రస్తుతం మరో వింత ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ గుడి తండా గ్రామానికి చెందిన రాందాస్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో ఓ వేప చెట్టు కింద నిత్యం పూజలు చేస్తుంటారు. కొంతకాలంగా ఈ చెట్టు నుండి తెల్లని ద్రవం కారడం గమనించింది వీరి కుటుంబం. అయితే వీరు ముందు పెద్దగా దానిని పట్టించుకోలేదు. జాగ్రత్తగా గమనించి చూస్తే కల్లులా అనిపించింది. వేప చెట్టుకు కళ్ళు కారుతుండనే వార్త ఈ నోట, ఆ నోట అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది గుడితండా తో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు.

దేవుని మహిమతోనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయంటూ గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇలాంటి వింత ఘటన తాము ఎప్పుడూ చూడలేదని, బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ సింగరౌలి లోని నిఘాహీలోను ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ కూడా ఇలాగే వేపచెట్టు దగ్గర ప్రజలు భారీగా చేరి ప్రత్యేక పూజలు చేశారు. ఆ వెపచెట్టు నుంచి కారే పాలను పాత్రలో నింపి ఇంటికి తీసుకువెళ్లారు.

Advertisement

Read also: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 02.02. 2023
  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?
  • నర్సుతో డాక్టర్ ప్రేమాయణం, పెళ్లి.. కానీ రెండేళ్లు గడవకముందే..!!
  • ఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నందమూరి తారక రత్న భార్య పిల్లల ఫొటోస్ ఇవి ఇప్పటి దాక చూసుండరు !
  • ఒక జిల్లా కలెక్టర్ అయ్యి..! పెళ్ళికి కట్నం అడిగాడు అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd