• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » మాస్ రివెంజ్ అంటే ఇదేమో ! తన భార్య ప్రియుడితో వెళ్ళిపోయింది ! రివెంజ్ ఎలా తీర్చుకున్నాడంటే ?

మాస్ రివెంజ్ అంటే ఇదేమో ! తన భార్య ప్రియుడితో వెళ్ళిపోయింది ! రివెంజ్ ఎలా తీర్చుకున్నాడంటే ?

Published on March 2, 2023 by karthik

Advertisement

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఆకర్షణకు లోనై తమ నిండు సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ రాష్ట్రంలోని చౌథామ్ బ్లాక్ హర్దియా గ్రామంలో చోటుచేసుకుంది. పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించిన మహిళ.. పెళ్లయి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత ప్రియుడితో పరారైంది.

దీంతో ఆమె భర్త చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చౌథామ్ బ్లాక్ లోని హర్దియా గ్రామానికి చెందిన ముఖేష్.. నీరజ్ అనే వ్యక్తి భార్యతో కలిసి పారిపోయాడు. దీంతో ముఖేష్ భార్యతో పరిచయం పెంచుకొని ఆమెను నీరజ్ వివాహం చేసుకున్నాడు.

Read also: “చిరంజీవి” నుంచి “ధనుష్” వరకు సినిమాల్లో మాస్టర్ గా నటించిన 10 స్టార్స్ వీరే !

Advertisement

ప్రియుడితో వెళ్లిపోయిన భార్యకు, నీరజ్ కు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. ముఖేష్ – నీరజ్ భార్యల పేర్లు రూబీయే కావడం గమనార్హం. అయితే నీరజ్ భార్య రూబీకి ముఖేష్ తో పెళ్లికి ముందు నుండే పరిచయం ఉండేది. పెళ్లికి ముందు ఇద్దరు ప్రేమలో ఉండగా.. రూబీ తల్లిదండ్రులు ఆమె ప్రేమకు నిరాకరించి నీరజ్ కు ఇచ్చి వివాహం చేశారు. కానీ రూబీ మాత్రం ముఖేష్ ను మరిచిపోలేకపోయింది. పెళ్లి తర్వాత కూడా సంబంధం కొనసాగించింది. దీంతో ముఖేష్ కు వేరే మహిళతో వివాహం జరిగింది. కానీ గతేడాది ఫిబ్రవరిలో తన ప్రియురాలు రూబీని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం ముఖేష్ – రూబీ తన ముగ్గురు పిల్లలను తీసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు. తన భార్యను తీసుకొని వెళ్ళిపోవడంతో ముఖేష్ పై పస్రాహ పోలీస్ స్టేషన్ లో నీరజ్ కేసు పెట్టాడు.

ఇక కొద్ది రోజుల తర్వాత ఈ విషయం పెద్దల పంచాయితీకి చేరింది. అయితే అక్కడ ముఖేష్ మాత్రం ప్రియురాలిని వదిలిపెట్టడానికి ముఖేష్ ఒప్పుకోలేదు. ఆమెతోనే కలిసి ఉంటానని తిగేసి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక పెద్దలు కూడా వదిలేశారు. దీంతో ముఖేష్ పై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న నీరజ్.. ముఖేష్ మొదటి భార్య రూబీ తో పరిచయం పెంచుకొని స్నేహం చేశాడు. ఆమె కూడా నీరజ్ ను అభిమానించడంతో ఇద్దరు కలిసి జీవించాలని భావించారు. ఇక ఫిబ్రవరి 18న వీరిద్దరూ స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నారు. నీరజ్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. ముఖేష్ మాత్రం రోజువారి కూలిగా పనిచేస్తున్నాడు.

Advertisement

Read also: చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?

 

Latest Posts

  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?
  • ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd