• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » యమగోల సినిమాలో ముందు బాలకృష్ణను హీరో అనుకొని.. తర్వాత తప్పించింది ఎవరు..!!

యమగోల సినిమాలో ముందు బాలకృష్ణను హీరో అనుకొని.. తర్వాత తప్పించింది ఎవరు..!!

Published on July 10, 2022 by mohan babu

Advertisement

నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ సినిమాలు ఏ విధంగా ఉంటాయో, ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యమగోల సినిమా ఒకటి. ఈ మూవీ తాతినేని రామారావు డైరెక్షన్ లో 1977 లో వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాను బెంగాల్ లో సూపర్ హిట్ అయినా యమలాయే మనుష్ సినిమా ని రీమేక్ చేశారు. అయితే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెంకటరత్నం ఈ మూవీ ద్వారా నిర్మాతగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాకు మాటలు మరియు అనువాదం చేసింది డి.వి.నరసరాజు. ఈ సినిమాలో యముడి పాత్రలో ఎన్టీఆర్ హీరోగా ఆయన తనయుడు బాలకృష్ణ అని అందరూ అనుకున్నారు. కానీ చివరకు కైకల సత్యనారాయణను యముని గా, హీరోగా సీనియర్ ఎన్టీఆర్ చేశారు.

అయితే ఇందులో బాలకృష్ణను తప్పించింది మాత్రం ఎన్టీఆరే.. మరి ఆయనను ఎందుకు తప్పించారు ఓ సారి చూద్దాం..?యమగోల అనే టైటిల్ తో మూవీ చేయాలని దర్శకుడు సి.పుల్లయ్య అనుకున్నారు. అప్పటికే పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవాంతకుడు మూవీ కూడా చేశారు. ఆ సినిమా విజయవంతమైంది. ఈ మూవీని కూడా యమధర్మరాజు టైప్ లోనే చేశాడు. ఇందులో ఎస్.వి.రంగారావు అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సందర్భంలోనే సి.పుల్లయ్య కొడుకు యమగోల కథ డెవలప్ చేసి నరసరాజు కు చెప్పాడు. ఈ కథ ఆయనకు నచ్చకపోవడంతో పక్కన పెట్టారు. ఈ మూవీ టైటిల్ హక్కులను నిర్మాత రామానాయుడు కొన్నారు. ఈ కథ మొత్తం విన్న రామానాయుడికి కొన్ని డౌట్లు ఉండటంతో ఆయన దీన్ని పక్కన పెట్టేసారు. ఇలా 17 సంవత్సరాల పాటు ఈ కథ హక్కులు రామానాయుడు దగ్గరే ఉన్నాయి.

Advertisement

దీని తర్వాత సినిమాటోగ్రాఫర్ గా ఉన్నటువంటి వెంకటరత్నం రామానాయుడు నుండి ఈ మూవీ రైట్స్ ను కొన్నారు. చివరికి రచయిత డి.వి.నరసరాజు కథను ఇంకా డెవలప్ చేశారు. దేవాంతకుడు అనే మూవీ ని ఎన్టీఆర్ తో తీశారు కాబట్టి యమగోల సినిమాలో ఆయన తనయుడు హీరో బాలకృష్ణ తో చేస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికి బాలకృష్ణ తన సొంత బ్యానర్ పై మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బయట మూవీస్ లో నటించేందుకు ఎన్టీఆర్ కి ఇష్టం లేదు. ఈ ఒక్క కారణం తోనే బాలయ్యని ప్రాజెక్టు నుండి ఎన్టీఆర్ తప్పించేసాడు. చివరకు ఈ సినిమాలో యముడిగా కైకాల సత్యనారాయణ హీరోగా ఎన్టీఆర్ కథానాయికగా జయప్రద చేశారు. దీంతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది.

Advertisement

ALSO READ:  “అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా ?

 

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd