• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Published on October 14, 2022 by anji

Advertisement

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా?.. అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తుకు వెళ్లాల్సిందే అన్న భావనలో వైసిపి అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా వైసిపి ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో, ప్రధాన కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Read also: వివేక హత్య కేసుపై సిబిఐకి షర్మిల ఫిర్యాదు? బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు !

అటు విశాఖలో పరిపాలన రాజధాని డిమాండ్ తో జేఏసీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని సీఎం జగన్ ఇప్పటికే వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు” ప్రభుత్వం వర్క్ షాప్ లో 27 మంది ఎమ్మెల్యేల పనితీరు వెనుకబడి ఉందని.. వారి పనితీరు మెరుగుపరుచుకునేందుకు సమయం ఇచ్చారు. ఇక తాజాగా గురువారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Advertisement

నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక సూచన చేశారు. వైసీపీ నేతలంతా ఇవాల్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. మరో 19 నెలల్లో మళ్లీ ఎన్నికలు రానున్నాయని.. ఇవాల్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళుతున్నామన్నారు. ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి వెళ్లి తిరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఏపీలో రోజురోజుకీ మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఇప్పటికే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది.

Read also: వీరప్పన్ కూతుర్ని మీరు ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు ఆమె పెద్ద లీడర్..!!

Related posts:

పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్లపై జగన్ కౌంటర్..అలా చేస్తే ఏపీ మహిళల పరిస్థితి ఏంటి ! దీవాళీ స్పెషల్ .. జగనన్న ఆటం బాంబులు ! మరో 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి ! మార్గదర్శి ఆస్తులపై జగన్ కన్ను ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd