• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఏపీలో బీజేపీ ఆపరేషన్ మొదలైనట్టేనా?

ఏపీలో బీజేపీ ఆపరేషన్ మొదలైనట్టేనా?

Published on December 6, 2022 by Idris

Advertisement

తెలంగాణపై బీజేపీ ఎంతో ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ సారథ్యంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. గ్రామగ్రామాన విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అలా.. ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు సంజయ్. ప్రతీ ఒక్కర్నీ పలకరించుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఐదో విడత యాత్ర చేస్తున్న ఆయన.. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఎలాంటి వ్యూహాలు రచించాలన్నది ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణపై వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. ఇది బీజేపీ ప్లానే అని ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.

Advertisement

టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐకి ఎంట్రీ లేకపోయినా.. అధికారులు ఏది చేయాలో అది చేసేస్తున్నారు. వరుస తనిఖీలు, విచారణలతో టీఆర్ఎస్ లో రోజురోజుకీ కలవరం ఎక్కువైంది. ముఖ్యంగా పార్టీకి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, సంస్థలను టార్గెట్ చేయడం.. బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ, కమలనాథులు మాత్రం తమకేం సంబంధం లేదని చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయని.. అవినీతికి పాల్పడకపోతే అంత ఉలుకెందుకని ప్రశ్నిస్తున్నాయి. ఓవైపు పార్టీని జనాల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ.. ఇంకోవైపు ప్రతిపక్షాలను తనదైన స్టయిల్ లో టార్గెట్ చేస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు.

Advertisement

ఇప్పుడు తెలంగాణ ఆపరేషనే త్వరలో ఏపీలో కూడా ఊపందుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ట్రైలర్ గా ఇద్దరు నేతల ఇళ్లల్లో సోదాలకు దిగింది ఐటీ. వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, వల్లభనేని వంశీల ఇళ్లల్లో తనిఖీలు జరిపారు ఐటీ అధికారులు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కొందరు వైసీపీ నేతలే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఈడీ. జగన్ పార్టీ బీజేపీతో సన్నిహితంగా ఉన్నా.. నేతలు మాత్రం తమది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అనుబంధమేనని అంతకుమించి ఏమీ లేదని అంటున్నారు. అయినా.. బీజేపీని బలోపేతం చేసుకోవాలంటే.. వైసీపీతో ఎప్పటికైనా నష్టమే అని గ్రహించిన కమలం పెద్దలు ఆపరేషన్ ఏపీని మొదలు పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

టీడీపీ హయాంలో సాగిన స్కిల్ డెవెలప్ మెంట్ స్కాంపై ఇప్పటికే ఈడీ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కాంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఐటీ ఎంటర్ అయింది. ఇలా వైసీపీ, టీడీపీ నేత‌ల వ్యాపార కార్య‌క‌లాపాల‌పై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయని సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts:

చిరంజీవిని తెగ పొగిడేస్తున్న మోడీ..! కేసీఆర్ వెంట పడుతున్న పాల్..! brs party working president ktr press meet at telangana bhavanఉక్కు నినాదం.. కేంద్రంపై బీఆర్ఎస్ కొత్త యుద్ధం Central Govt steps back on Vizag steel plant Privatisationస్టీల్ ప్లాంట్ బిడ్డింగ్.. తెలంగాణ సర్కార్ జాడేది?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd