• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఫోన్ చూస్తూ లెక్చరర్ కి దొరికిన విద్యార్థిని.. ఇక ఆ తరువాత ఏం జరిగిందంటే ?

ఫోన్ చూస్తూ లెక్చరర్ కి దొరికిన విద్యార్థిని.. ఇక ఆ తరువాత ఏం జరిగిందంటే ?

Published on June 8, 2023 by anji

Ads

ఈ సమాజం రోజు రోజుకు ఏమవుతుందో తెలియకుండా పోతుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి ఎదుగుదలకు అండగా నిలవాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల యమధూతలుగా మారుతున్నారు. కొంత మంది ఒత్తిడితో కూడిన చదువులు చదవలేక కొందరూ.. మరికొందరూ తోటివారు ముందు హేళనకు తట్టుకోలేక తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. తాము తప్పులు చేస్తే పెద్ద మనస్సు చేసుకొని సున్నితంగా చెప్పాల్సిన లెక్చరర్స్ చాలా కాఠిన్యంగా వ్యవహరిస్తుండటంతో మనస్థాపానికి గురై విద్యార్థులు ఉరి కొయ్యెలకు వేలాడుతున్నారు. కళాశాలలో కొన్ని పాలిటిక్స్ వల్లనే విద్యార్థులు బలి అవుతున్నారు. 

ల్యాబ్ సెషన్ లో విద్యార్థిని ఫోన్ తీసిందని కోపపడిన అధ్యాపకుడు.. ఆమె ఫోన్ లాక్కోవడంతో పాటు తిట్టడంతో ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన కేరళలోని కంజిరపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. అమల్ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఫుడ్ టెక్నాలజీ చదువుతున్న విద్యార్థిని శ్రద్ధా సతీష్ (20) జూన్ 02న కళాశాలకు వెళ్లింది. కళాశాలలో ల్యాబ్ సెషన్ ఉండగా ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఫోన్ బయటికి తీసింది. అక్కడే ఉన్న అధ్యాపకులు ఆమె ఫోన్ లాక్కుని.. హెచ్ఓడీ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అసలు ఏం జరిగిందో మాత్రం తెలియదు. కానీ ఆ తరువాత కళాశాలకి చెందిన హాస్టల్ లో విగత జీవిగా కనిపించింది శ్రద్ధా. 

Advertisement

కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ.. తోటి విద్యార్థులు నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కావాలనే ఆ విద్యార్థిని ని టార్గెట్ చేయడంతో చనిపోయిందని తోటి విద్యార్థులు ఆరోపించారు. కళాశాలకు సంబంధించి గతంలో ఓ ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్న శ్రద్ధా తన అభిప్రాయాన్ని పంచుకుంది. దీంతో అప్పటి నుంచి కళాశాల యాజమాన్యం మనస్సులో పెట్టుకొని వేధిస్తున్నారని తోటి విద్యార్థులు వాపోతున్నారు. రెండు రోజులు తమతో సంతోషంగా ఉండి వెళ్లి వెళ్లిన కుమార్తె అదె రోజు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి రోదనలు బాధకలిగిస్తున్నాయి. కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అంబటి రాయుడు తెలుగు విని ఆశ్ఛర్యపోయిన హీరో నాని..!

పక్కింటి వాళ్లు తిట్టినా.. భర్త పట్టించుకోలేదని భార్య ఏం చేసిందో తెలుసా ?

తమ్ముడు సినిమాలో నటించిన ఈ కమెడియన్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?

Related posts:

సంచలనం సృష్టించిన సాయి ప్రియ కేసులో నెలరోజుల తర్వాత కొత్త ట్విస్టులు! అక్క బిడ్డల కోసం బావను పెళ్లి చేసుకున్న మరదలు ! తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూస్తున్నారని యువతి ఏం చేసిందో తెలుసా ? ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రియురాలు ఏం చేసిందో తెలుసా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
  • డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd