• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » సంచలనం సృష్టించిన సాయి ప్రియ కేసులో నెలరోజుల తర్వాత కొత్త ట్విస్టులు!

సంచలనం సృష్టించిన సాయి ప్రియ కేసులో నెలరోజుల తర్వాత కొత్త ట్విస్టులు!

Published on August 31, 2022 by Bunty Saikiran

Advertisement

విశాఖతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సాయి ప్రియ కేసులో మరో ట్విస్ట్. ప్రేమ జంటపై పోలీసు కేసు నమోదు అయింది. పోలీసులను బురిడీ కొట్టించారంటూ, సాయి ప్రియ తో పాటు ఆమె ప్రియుడు రవితేజపై విశాఖ పోలీసులు కేసు పెట్టారు. ప్రభుత్వ ధనం, సమయం వృధా చేసినందుకు కోర్టు అనుమతితో వాళ్ళిద్దరిపై కేసు నమోదు చేశారు. సాయిప్రియ నిర్వాకంతో ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్ గార్డు, పోలీసుల విలువైన టైం వేస్ట్ అయిందని పోలీసులు భావించారు. తన భర్తను మోసగించి ప్రియుడితో వెళ్లడమే కాకుండా పోలీసులను తప్పు ద్రోవ పట్టించినందుకు ఆమె పై సీరియస్ గా ఉన్నారు పోలీసులు. ఆమె విషయంలో కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో సాయి ప్రియ తో పాటు ఆమె లవర్ రవితేజ పై కేసు నమోదు చేశారు విశాఖపట్నం పోలీసులు.

విశాఖపట్నంకి చెందిన సాయి ప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు తో వివాహం జరిగింది. శ్రీనివాసరావు హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగా, సాయి ప్రియ ఎన్ఏడి సమీపంలో ని సంజీవయ్య నగర్ లో ఉంటూ కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటుంది. జులై 22న పెళ్లిరోజు కావడంతో భర్తతో కలిసి విశాఖ బీచ్ కు వెళ్ళింది సాయి ప్రియ. కాసేపటి తర్వాత ఆమె బీచ్ లో కనిపించకుండా పోయింది. రాత్రి 7:30 గంటల సమయంలో శ్రీనివాస రావుకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు. ఎంత వెతికినా సాయిప్రియ కనిపించకపోవడంతో సముద్రంలో గల్లంతయ్యిందని భావించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాయిప్రియ కోసం నేవీ, తీరగస్తి దళాలు ముమ్మరంగా గాలించాయి.

Advertisement

స్పీడ్ బోట్లు, నేవీ హెలికాప్టర్ ద్వారా గాలించారు. సాయి ప్రియను వెతికేందుకు అధికారులు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. హెలికాప్టర్ సాయంతో గాలించడంతో భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చింది. సముద్రంలో రెండు రోజులు వెతికిన ఆమె జాడ దొరకలేదు. ఇంతలోనే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. బీచ్ లో భర్తను ఏ మార్చి తన ప్రియుడితో వెళ్లిపోయింది సాయి ప్రియ. బెంగుళూరులో ప్రియుడితో కలిసి ప్రత్యక్షమైంది. అక్కడే అతడిని పెళ్లి చేసుకుంది. రెండు రోజుల తర్వాత తనకోసం వెతకద్దు, తాను రవితేజను పెళ్లి చేసుకున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టింది. సాయి ప్రియ ఇచ్చిన ట్విస్టు తో అంతా షాక్ అయ్యారు. పోలీసుల సూచనతో తర్వాత ప్రియుడితో కలిసి విశాఖపట్నం వచ్చింది. సాయిప్రియ పోలీసులకు వివరణ ఇచ్చింది. అంతేకాదు తమకు రక్షణ కల్పించాలని కోరింది.

Advertisement

Read also: హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది? 

Latest Posts

  • కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ!
  • కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి
  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd