• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » కత్తులతో చేజింగ్.. సినిమా సీన్ కాదు.. రియల్ మర్డర్..!

కత్తులతో చేజింగ్.. సినిమా సీన్ కాదు.. రియల్ మర్డర్..!

Published on January 22, 2023 by sasira

Advertisement

సినిమాల్లో విలన్లు కత్తులతో వెంబడించే సీన్లు తరచూ చూస్తూనే ఉంటాం. బాస్ ఆర్డర్ వేశాడని అవతలి వ్యక్తిని నడిరోడ్డుపైనే వెంటాడి చంపేస్తుంటారు. అయితే.. ఇలాంటి సీన్ ఒకటి మహానగరం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అచ్చం సినిమా సీన్ ను తలపించిన ఈ ఘటన.. జియాగూడలో చోటు చేసుకుంది.

ముగ్గురు దుండగులు కత్తులు, వేటకొడవళ్లతో ఓ వ్యక్తిని వెంబడిస్తూ కనిపించారు. తర్వాత అత్యంత కిరాతకంగా నరికేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. చనిపోయింది కోఠి ఇసామియా బజార్‌ కు చెందిన జంగం సాయినాథ్‌(32)గా గుర్తించారు.

Advertisement

ఇంతకీ.. దాడికి పాల్పడింది ఎవరు? ఇతన్ని టార్గెట్ ఎందుకు చేశారు? వీరి మధ్య ఏదైనా వైరం ఉందా? లేక.. సుపారీ తీసుకుని మర్డర్ చేశారా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ హత్యను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జరిగింది పట్టపగలు నడిరోడ్డుపై కావడంతో అంతా షాకయ్యారు.

Advertisement

మర్డర్ చేశాక నిందితులు పక్కనే ఉన్న మూసీ నదిలోకి దూకారు. అటునుంచి పారిపోయినట్టు స్థానికులు పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన ఖాకీలు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య జరుగుతుండగా కొందరు వీడియోలు తీశారు. అవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Posts

  • డీజీపీ ఆఫీస్ ముట్టడించిన వారికి షాక్..!
  • క్రిటికల్ గానే తారకరత్న పరిస్థితి.. మెలేనాతో సతమతం.. ఏంటీ వ్యాధి?
  • వివేకా హత్యకేసు.. సీబీఐ దూకుడుతో మిస్టరీ వీడేనా?
  • ముందస్తు సవాల్.. బీజేపీ రియాక్షన్ ఏంటో..?
  • ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd