• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » కేసీఆర్ సభపై ఉత్కంఠ.. ఏం మాట్లాడబోతున్నారు..?

కేసీఆర్ సభపై ఉత్కంఠ.. ఏం మాట్లాడబోతున్నారు..?

Published on October 29, 2022 by Idris

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారపర్వం చివరి దశకు చేరుకుంది. నవంబర్ 1 సాయంత్రం 6 టలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో చివరి మూడు రోజులు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. కాకపోతే చివరి నిమిషంలో బీజేపీ సభను రద్దు చేసుకుంది. 30న టీఆర్ఎస్ సభ, 1న కాంగ్రెస్ మహిళా గర్జన యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే.. టీఆర్ఎస్ సభకు కేసీఆర్ హాజరవుతుండడం.. ఆయన ఏం మాట్లాడనున్నారనే ఉత్కంఠ అందరిలో ఉంది.

Advertisement

కొద్ది రోజులుగా మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారం చుట్టే తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ఈ ఇష్యూపై టీఆర్ఎస్ మొదట్లో కాస్త హడావుడి చేసినా.. కేటీఆర్ సైలెంట్ గా ఉండమని చెప్పడంతో అంతా గప్ చుప్ అయిపోయారు. అయితే.. సీఎం కేసీఆర్ కూడా మౌనంగా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విషయం బయటకు వచ్చాక.. వెంటనే ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు కేసీఆర్. తర్వాతి రోజు వారితో కలిసి ప్రెస్ మీట్ పెడతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఏది జరగలేదు.

Advertisement

ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు వెళ్తున్నారు కేసీఆర్. చండూరులో ఆదివారం ముఖ్యమంత్రి సభ జరగనుంది. మొయినాబాద్ ఫాం‎హౌస్ ఎపిసోడ్‎ ని అస్త్రంగా చేసుకుని కేసీఆర్ కేంద్రంపై అక్కడే విరుచుకుపడతారని చర్చ సాగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలను చండూరు సభకు సీఎం తీసుకువెళ్తారట. సభా వేదిక నుంచే ఎమ్మెల్యేల కొనుగోలుపై కేసీఆర్ స్పందిస్తారని అంటున్నారు. ఈ క్రమంలో సీఎం ఏం మాట్లాడతారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇటు కేసీఆర్ సభకు పోటీగా బీజేపీ ఏర్పాటు చేసిన నడ్డా సభ రద్దయింది. సభ కన్నా.. ఇంటింటి ప్రచారమే బెస్ట్ అని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు చండూరు‎లో నవంబర్ 1న మహిళా గర్జన సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. తమ అభ్యర్థి మహిళ కావడం వల్ల ఓట్లు రాబట్టేందుకు ఈ సభ మేలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Related posts:

సిట్ ఆశలు ఆవిరి.. అప్పటిదాకా ఆగాల్సిందే..! షర్మిలకు ఛాన్స్ ఇస్తున్న గులాబీ బాస్! ఎమ్మెల్యేల ఎర కేసు.. ఏ క్షణమైనా.. ఏదైనా..! పోరు తెలంగాణ.. ఆవేదనలో రైతన్న!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd