• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

Published on March 4, 2023 by karthik

Advertisement

మైదాపిండి దీనిని గోధుమపిండి నుండి తయారుచేస్తారు. గోధుమ పిండిలో బెంజైయిల్ పెరాక్సైడ్ అనే రసాయనంతో పాటు మరికొన్నింటినీ కలపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్, స్వీట్లు తయారీలో ఇటీవల కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ పిండిలో ఎలాంటి పోషకాలు లేవని అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు. బెంజాయిల్ పెరాక్సైడ్ మాత్రమే కాకుండా ప్రమాదకరమైన రసాయనమైన అలోక్సేన్ కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ పిండిని వాడడంపై ఆంక్షలు విధించాయి.

Read also: డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

Advertisement

రోజువారిగా ప్రస్తుతం మనం తినే బ్రెడ్, కేకులు, పిజ్జా, బర్గర్లు, నూడిల్స్ అన్ని మైదా పిండితో తయారుచేసిన ఆహారాల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ఇది ఒకింత అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోధుమపిండిని మైదాపిండిగా మార్చే క్రమంలో పోషకాలు అన్ని తొలగించబడతాయి. ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఈ పిండిలోకి రసాయనాలు వచ్చి చేరతాయి. కాబట్టి దీనితో చేసిన ఆహార పదార్థాలు తినటం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. కడుపు నిండిన భావన మాత్రమే కలుగుతుంది.

అంతేకాకుండా బరువు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మైదా పిండి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాకుండా మైదాతో తయారైన ఆహార పదార్థాలలో అధిక నూనె వినియోగం వల్ల శరీరంలో చెడు కొవ్వులు పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. మధుమేహాలు, మైదాతో తయారుచేసిన ఆహార పదార్థాలను తినకుండా ఉండడం మంచిది. ఆమ్లత్వం కలిగిన మైదాపిండి ఆహారాలు ఎముకలకు హాని కలిగిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

Advertisement

Read also: బాలయ్య బాబు “అఖండ” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd