• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » రోడ్డు పక్కన ఉండే చెట్లకు ఎరుపు, తెలుపు రంగులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా..?

రోడ్డు పక్కన ఉండే చెట్లకు ఎరుపు, తెలుపు రంగులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా..?

Published on September 29, 2022 by mohan babu

Advertisement

సాధారణంగా రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్లకు ఇరువైపులా చెట్లను చూసే ఉంటాం. ఆ చెట్లను చూస్తుంటే మనకు మంచి ఆహ్లాదం అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మరి ఆ చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేసి ఉంటాయి. మరి ఆ పెయింట్ లు ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం..?

రహదారి వెంబడి ఉండేటువంటి చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేస్తారు అంటే అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన ట్రీస్ అని అర్థం. ఇవి అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని సంకేతం. వృక్షాలను అటవీశాఖ వారే ప్రత్యేకంగా రక్షిస్తున్నారు అన్నమాట. ఇలాంటి చెట్లకు మనం ఏ విధమైన హాని తలపెట్టిన ప్రభుత్వపరంగా చర్యలు అనేవి ఉంటాయి.

Advertisement

Advertisement

అలాగే అందరూ సులువుగా గుర్తించడం కోసమే ఈ రంగులను వేస్తారు. ఇక తెలుపు రంగు పెయింట్ ఎందుకు వేస్తారు అంటే రాత్రిపూట ఈ చెట్లు ప్రయాణికులకు సులభంగా కనిపించాలని తెలుపు రంగును చెట్ల కింద భాగంలో వేస్తారు. ఈ తెలుపు రంగు పైన కొంత భాగం ఎరుపు రంగు పెయింట్ వేస్తారు. ఎందుకంటే భూమిలోంచి క్రిమికీటకాలు చెట్టు ఎక్కి పాడు చేస్తాయని చెట్టు మొదటి భాగం నుంచి పెయింట్ వేసి వదిలేస్తారు. దీని వల్ల చెట్లు సురక్షితంగా ఉంటాయి. ఈ పెయింట్ వల్ల చెట్లు కూడా త్వరగా దెబ్బతినకుండా ఉంటాయని చెబుతున్నారు.

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd