• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » మోడీ టార్గెట్ గా కేటీఆర్ సంచలన ట్వీట్ !

మోడీ టార్గెట్ గా కేటీఆర్ సంచలన ట్వీట్ !

Published on October 13, 2022 by anji

Advertisement

మునుగోడు ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది ప్రధాన పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీ ఇచ్చే కాంట్రాక్టుల కోసమే ఆ పార్టీలో చేరారని టిఆర్ఎస్ మొదటినుండి బలంగా విమర్శిస్తోంది. ఇటీవల మంత్రి జగదీష్ రెడ్డి బిజెపిని ఉద్దేశిస్తూ రాజగోపాల్ రెడ్డికి బిజెపి ఇచ్చిన 18 వేల కోట్లను మునుగోడు నియోజకవర్గానికి ఖర్చు చేస్తే ఉప ఎన్నిక తప్పుకుంటామని సవాల్ విసిరారు.

Advertisement

Read also: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక ?

అయితే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొనసాగిస్తూ మంత్రి కేటీఆర్ అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వాళ్లు కోమటిరెడ్డి లు కాదు.. కోవర్ట్ రెడ్డిలు అని సంచలన ఆరోపణలు చేశారు. కోవర్టు ఆపరేషన్ చేసే ఈ చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలపాలని అన్నారు మంత్రి కేటీఆర్. అటు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద మెరుగు పడదని అన్నారు.

Advertisement

మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదని.. అలాగే నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు అంటూ ట్వీట్ చేశారు. ” నీతి అయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథ కి 19,000 కోట్లు కేటాయించమని సిఫారసు చేస్తే పెడచెవిన పెట్టారు. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు 18,000 కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుండి తప్పుకుంటాం. దీనికి బిజెపి సిద్ధమా?” అని ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ఉప ఎన్నిక తీసుకోవచ్చారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోడీ ప్రదర్శించిన అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికనే మునుగోడు ఉప ఎన్నిక అని అన్నారు కేటీఆర్.

Read also: ఢిల్లీ లిక్కర్ స్కాం లో కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ !

Related posts:

తమ్ముడి దెబ్బకు..రాజకీయాలకు గుడ్‌ బై ? తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి నేనే ! BRS MLA Rajaiah Cryingఅయ్యయ్యో రాజయ్య.. బోరున ఏడ్చేశారు! Mp Komatireddy Serious Comments on Pm Modiపోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd