• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » మొదటిరోజే విపక్షాల ఝలక్

మొదటిరోజే విపక్షాల ఝలక్

Published on January 31, 2023 by Idris

Advertisement

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈసారి రెండు విడతల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా ఫిబ్రవరి 13 వరకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అలాగే, మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 6 వరకు రెండో విడతలో సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉభయసభలనుద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

Advertisement

ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్‌ తయారైందని అన్నారు ముర్ము. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతోందని.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయని చెప్పారు. మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందని వివరించారు. పేదరికం లేని భారత్‌ నిర్మాణం కోసం కృషి జరుగుతోందన్న ఆమె.. భారత డిజిటల్‌ నెట్‌ వర్క్‌ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారిందన్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

Advertisement

కరోనా కష్టకాలాన్ని అధిగమించడంలో స్థిరమైన ప్రభుత్వం కృషి చేసిందన్న రాష్ట్రపతి.. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామన్నారు. పేదల ఆలోచన స్థాయిని కూడా పెంచుతున్నామని.. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని.. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు. బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నామని.. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు ముర్ము.

మరోవైపు రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాయి పలు విపక్ష పార్టీలు. కాంగ్రెస్, ఆప్, బీఆర్ఎస్ వంటి పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశారు. అయితే.. విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై బీజేపీ మండిపడుతోంది. పార్లమెంట్ పట్ల, ఈ దేశం పట్ల వారు చూపుతున్న అగౌరవానికి ఇది నిదర్శనమని అమిత్ మాలవీయ తీవ్రంగా తప్పు పట్టారు.

సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా.. కేవ‌లం మ‌న దేశం మాత్ర‌మే కాదు.. అన్ని దేశాలు కూడా మ‌న బ‌డ్జెట్‌ పై దృష్టి పెట్టిన‌ట్లు తెలిపారు. ప్ర‌పంచ ఆర్ధిక అంశాల‌పై విశ్వ‌స‌నీయ‌మైన సంస్థ‌లు కొన్ని పాజిటివ్ సందేశాలు చేశాయ‌న్న ఆయన.. విపక్ష నేతలు సమావేశాలకు సహకరించాలని కోరారు.

Related posts:

మాజీ ప్రధానిపై కాల్పులు.. నిందితుడు ఏం చెప్పాడంటే..? మరో వివాదంలో గరికపాటి పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. ఈవెంట్స్ నిర్వహించే ప్లేస్ లు ఇవే సెంటిమెంట్ రగిలిస్తున్న మోడీ!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd