• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ప్రతిపక్షాలపై మోడీ సీరియస్.. ఆ వెంటనే రాహుల్ కౌంటర్స్

ప్రతిపక్షాలపై మోడీ సీరియస్.. ఆ వెంటనే రాహుల్ కౌంటర్స్

Published on February 8, 2023 by Idris

Advertisement

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. గత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలను ప్రస్తావిస్తూ సెటైరికల్ గా మాట్లాడారు. దర్యాప్తు సంస్థలపై విపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని.. వాళ్లు కలిసింది దేశం కోసం కాదని చురకలంటించారు. ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఈ సందర్భంగా ఈడీకి ధన్యవాదాలు చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు.

Advertisement

తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని చెప్పిన మోడీ.. ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, అది విపక్షాలకు అందదని చెప్పారు. తాను 25 కోట్ల కుటుంబాల సభ్యుడినని.. వాళ్లందరికీ తాను సేవ చేస్తుంటే.. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారని విమర్శించారు. గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపై ఆధారపడేదని, నేడు మనమే ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని అన్నారు.

Advertisement

కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారని చెప్పారు మోడీ. నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని.. భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని వివరించారు. భారత్‌ లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని చురకలంటించారు. ఇక మోడీ ప్రసంగం తర్వాత పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి ప్రసంగం మొత్తం విన్నానని.. ఎక్కడా అదానీ కుంభకోణాల అంశాన్ని ప్రస్తావించలేదన్నారు.

అదానీ అంశాన్ని సభ్యులు సభలో లేవనెత్తినా కూడా ప్రధాని మాత్రం గమ్మునుండిపోయారని మండిపడ్డారు రాహుల్. ప్రధాని చేసిన ప్రసంగం తనకు సంతృప్తి కలిగించలేదని.. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అదానీ కుంభకోణాల వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. అదానీని మోడీ రక్షిస్తున్నారన్నది స్పష్టమైపోయిందన్న ఆయన.. రానున్న రోజుల్లో అదానీ వ్యవహారంపై తమ పార్టీ ఉధృత పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇటు అదానీ గ్రూప్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందుకు మోడీ ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం తీసుకుంటోందని లోక్ సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు.

Related posts:

BRS MLA Rajaiah Cryingఅయ్యయ్యో రాజయ్య.. బోరున ఏడ్చేశారు! ఒకేసారి అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ ప్రెగ్నెంట్.. ఎలాగంటే..? ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ .. తెలుసుకోకుంటే కష్టమే..!! TTDకీ 3 కోట్లు జరిమానా వేసిన కేంద్రం.. జరిగిందేంటంటే..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd