• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఏం జరగనుంది?

టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఏం జరగనుంది?

Published on April 3, 2023 by Idris

Advertisement

కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని బీఆర్ఎస్ కి మధ్య యుద్ధం నడుస్తోంది. రోజూ ఏదో ఒక అంశం చుట్టూ ఇరు పార్టీల నేతలు తిట్టుకోవడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ఉసిగొల్పుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

SIT Record TSPSC Chairman Janardhan Reddy Statement In Paper Leak Case

అవును, టీఎస్పీఎస్సీ లీకేజీ అంశంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో నిజానిజాలేంటో తేల్చేందుకు అధికారులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. పేపర్ లీక్ పై సిట్‌ తో పాటుగా ఈ అంశంలో ఈడీ కూడా విచారణ చేయబోతుంది. ఎగ్జామ్ పేపర్స్ లీక్ స్కాంలో హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అరెస్టు అయిన 15 మందిని తిరిగి విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవసరమైన పక్షంలో టీఎస్పీఎస్సీ సభ్యులతో పాటు సెక్రెటరీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

మరోవైపు దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే బోర్డ్ సభ్యులను ప్రశ్నించిన అధికారులు.. చైర్మన్ జనార్ధన్ రెడ్డిని కూడా విచారించింది. దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించిన సిట్.. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. ఈ కేసులో జనార్ధన్ రెడ్డి స్టేట్ మెంట్ కీలకం కానుంది. కాన్ఫిడెన్షియల్ రూంలో జరిగే యాక్టివిటీస్ అన్నింటినీ ఛైర్మెన్ నుండి వివరాలు సేకరించింది సిట్ బృందం.

నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లు ఆఫీస్ లో చేసిన పని తీరు గురించి వివరాలు సేకరించింది. ప్రవీణ్ , రాజశేఖర్ ల ల్యాప్ టాప్ సమాచారాన్ని మరోసారి పరిశీలించింది. ఇక ఇదే కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీలోకి అనుమతిచ్చింది నాంపల్లి కోర్టు. ఇటీవల ఆరెస్ట్ అయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది.

Related posts:

BJP leaders angry at Bandi Sanjayబండిని వదలమంటున్న బీఆర్ఎస్ నేతలు కవితకు ధైర్యం చెప్పిన కేసీఆర్! కవిత ధర్నాకు ఓకే.. రంగంలోకి బీజేపీ! Minister KTR Issues Legal Notices To Bandi Sanjay & Revanth Reddy In TSPSC Paper Leakబండి, రేవంత్ కు షాకిచ్చిన కేటీఆర్

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd