• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » తెలంగాణ భారత్ జోడో యాత్రలో స్వల్ప మార్పులు.. రూట్ మ్యాప్ ఇదే..

తెలంగాణ భారత్ జోడో యాత్రలో స్వల్ప మార్పులు.. రూట్ మ్యాప్ ఇదే..

Published on October 14, 2022 by anji

Advertisement

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి.హీరేహళ్ సరిహద్దుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వాస్తవానికి కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి ఈ పాదయాత్ర కొనసాగేలా ప్లాన్ చేశారు. కానీ ముందుగానే ఈ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించింది. ఈ పాదయాత్ర కేవలం ఒకరోజు మాత్రమే ఏపీలో కొనసాగనుంది.

Advertisement

Read also:  చిరంజీవికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..!!

ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఏరియాలు తమిళనాడు, కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉంటాయి. దీంతో కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ బళ్లారి ప్రాంతానికి చేరుకొని పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 17న కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారత్ జోడో యాత్ర ఏపీలోకిి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు అయింది. దీపావళి తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలోకి అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. రాహుల్ పాదయాత్ర ఈనెల 31న కర్ణాటక నుంచి కృష్ణానగర్ బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం లోకి ప్రవేశిస్తుంది.

Advertisement

ఇక మద్నూర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ముందుగా అనుకున్న రూట్ లో కొన్ని మార్పులు చేసి ఫైనల్ రూట్ మ్యాప్ ని ఖరారు చేశారు. దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, చార్మినార్, గాంధీభవన్, నెక్లెస్ రోడ్, బోయిన్ పల్లి, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్చెరువు, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట్, మద్దునూరు వరకు ఈ యాత్ర సాగనుంది. యాత్రపై సమన్వయం చేసేందుకు పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. పాదయాత్రని విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Read also:  ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Related posts:

తెలంగాణలోకి భారత్‌ జోడోయాత్ర ఎంట్రీ.. నారాయణపేట జిల్లాలో భారీ స్వాగతం బడ్జెట్ కలిపింది అందరినీ..! గవర్నర్ ను అంత మాటంటారా? BJP leaders angry at Bandi Sanjayబండిని వదలమంటున్న బీఆర్ఎస్ నేతలు

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd