• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » రాళ్ల దాడి చుట్టూ ఏపీ పాలిటిక్స్

రాళ్ల దాడి చుట్టూ ఏపీ పాలిటిక్స్

Published on April 22, 2023 by Idris

Advertisement

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. లోకేష్ పాదయాత్రతో జనంలోనే ఉంటున్నారు. ఇటు చంద్రబాబు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై వారు విరుచుకుపడుతున్నారు. వాటికి జగన్ సేన కూడా ధీటుగా బదులిస్తోంది. ఈ నేపథ్యంలో డైలాగ్ వార్ తారస్థాయిలో కొనసాగుతోంది.

Advertisement

శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది. చంద్రబాబు ఎర్రగొండపాలెం వస్తున్న సమయంలో ముందస్తుగానే ఘర్షణలకు కుట్ర చేశారన్న కొన్ని వీడియోలను టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మంత్రి సురేష్ పోలీసులను ఆదేశిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న చంద్రబాబుపై రాళ్ళ దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖకు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. వీఐపీ భద్రతకు సంబంధించి స్థానిక పోలీసులు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల అభ్యంతరం తెలియజేశారు. ఇటు చంద్రబాబు కాన్వాయ్‌ పై రాళ్ల దాడి ఘటనను ఎన్‌ఎస్‌జీ హెడ్‌ క్వార్టర్స్ సీరియస్‌ గా తీసుకుంది.

Advertisement

మరోవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చేశారు మంత్రి సురేష్. తాము రాళ్ల దాడి చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధం.. టీడీపీ నేతలు వస్తే కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. నిరసన ప్రాంతానికి చేరుకున్న సమయంలో దళిత నేతలను చంద్రబాబు వేలు చూపించి బెదిరించారని.. అల్లరి మూకలను తమ మీదకు ఉసిగొల్పారని ఆరోపించారు. కారంచేడు, చుండూరు లాంటి మరో మారణహోమం సృష్టించాలనుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. ఆదిమూలపు సురేష్ సురేష్ ఏనాడైనా దళితుల గురించి పోరాడారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి జవహర్. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకోని సురేష్‌ కు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అర్ధ నగ్న ప్రదర్శన చేయాల్సంది తాడేపల్లి ప్యాలెస్ ముందు అని పేర్కొన్నారు. మంత్రి సురేష్ దగ్గరుండి వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ పైకి ఉసిగొల్పారన్నారు ఎంపీ కేశినేని నాని. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వైసీపీకి చెల్లిస్తామని హెచ్చరించారు కేశినేని.

Related posts:

బైరెడ్డికి కౌంటర్ వేసిన నాగబాబు రాప్తాడు హైటెన్షన్ రాజకీయం.. కారకులెవరు..? ysvivekaYS Vivekananda Reddy: వివేకా హత్య కేసు లో మరో ట్విస్ట్ ! తెరపైకి మరో మహిళ ఎవరు ఆమె ? VV Lakshminarayana praised KCRబీఆర్ఎస్ పై మాజీ జేడీ ప్రేమ.. బీజేపీ ఆగ్రహం

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd