• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » మహానటి సావిత్రిని వారి కుటుంబమే గెంటేసిందా.. కూతురు ఎమోషనల్ కామెంట్స్..!!

మహానటి సావిత్రిని వారి కుటుంబమే గెంటేసిందా.. కూతురు ఎమోషనల్ కామెంట్స్..!!

Published on March 16, 2023 by mohan babu

Advertisement

మహానటి సావిత్రి అంటే ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అప్పట్లో ఈమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్,ఏఎన్నార్ వంటి వారు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు అంటే ఆమెకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను కట్టిపడేసిన ఈమె అంటే ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉంటుంది. చాలామంది సావిత్రి హీరోయిన్ అంటే చాలు థియేటర్లకు పరుగులెత్తేవారు. అంతలా ప్రేక్షకులను ఆకర్షించింది సావిత్రి.

also read:అతి చిన్న వయసులోనే జీవిత భాగస్వాముల్ని కోల్పోయిన 9టాలీవుడ్ జంటలు !

అలాంటి ఈమె తమిళ హీరో జెమినీ గణేషన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే అప్పటికే అతడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసినా సావిత్రి పెళ్లి చేసుకోని ఆ తర్వాత ఎంతో బాధపడింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో తాగుడుకు బానిస అయిపోయింది. సీనియర్ నటిగా ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండాల్సిన సావిత్రి ఇలా అయిపోవడం అందరినీ బాధ పెట్టింది. ఇదే అలవాటు చివరకు ఆమె అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయి.మందు ముట్టుకోవద్దని వైద్యులు తేల్చి చెప్పారు. అయినా కూడా ఆమె వినిపించుకోలేదు.

Advertisement

also read: కేంద్ర ప్రభత్వం చేసిన ఒక్క తప్పుతో ఇంకో ఆస్కార్ అవార్డు ని మిస్ అయ్యారా ?

దీంతో ఆమె బిడ్డలు బ్యాంకు పుస్తకాలు దాచిపెట్టి డబ్బులు ఇవ్వకుండా చేశారు. దీనివల్ల రాత్రివేళ ఇంటి నుంచి వెళ్లిపోతానని సావిత్రి గొడవ చేయడంతో వాళ్లు పొమ్మని తెగేసి చెప్పారట.. ఇటీవల సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఈ ఘటనపై స్పందించి మాట్లాడుతూ.. మేము మా అమ్మ కోసమే అలా చేశాం.. తప్పు చేశామని అప్పట్లో భావించలేదు. ఏది ఏమైనా అమ్మ చివరి రోజుల్లో దారుణమైన స్థితిలో మరణించడం చాలా బాధాకరం అంటూ బాధపడింది. ఇక చిత్రాల పరంగా సావిత్రి సక్సెస్ అయిన వ్యక్తిగతంగా సక్సెస్ కాలేదు. దీంతో మధ్యానికి బానిస అయి దారుణంగా మరణించడం అందరినీ కంటతడి పెట్టించింది.

Advertisement

also read: “భరత్ అనే నేను” లో డైలాగ్స్ చెప్పడానికి మహేష్ ఇంత కష్ట పడ్డారా ?

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd