• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

Published on September 18, 2022 by mohan babu

Advertisement

శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఐదవ అవతారం మరియు మొదటి అవతారం వామనుడు.. ఈ వామనుడు అతిథి గర్భాన జన్మించిన వ్యక్తి. మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు.. వైరోచకుని కుమారుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు. బలి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు. ఆ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ దశమి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు. ఈ విధంగా బలిని అణచివేసే సమయం కోసం ఎదురు చూడ సాగాడు. అయితే ఒకసారి బలి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తోంది.

 

also read:పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారో మీకు తెలుసా.. ఏ నెంబర్ ఉన్న పండ్లు మంచివంటే..?

Advertisement

బలిని తొక్కడానికి ఇదే సరైన సమయంగా విష్ణుమూర్తి చిన్నారి బ్రాహ్మణుడు వామనుడి రూపంలో యాగశాల వద్దకు వెళ్తాడు. దీంతో బలిచక్రవర్తి ఆ వామనుడికి సాదర స్వాగతం పలికి నీకు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. తమకు యాగం చేసుకోవడానికి మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. దీంతో బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం అడుగుతున్నా అతడు వామన రూపంలో ఉన్నటువంటి రాక్షస విరోధి అయిన మహా విష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కనిపెడతాడు. ఇదే విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు. కానీ అప్పటికే ఆయన మాట ఇచ్చేశానని, ధనం మరియు ప్రాణం మీద వ్యామోహంతో మాట వెనక్కి తీసుకోలేనని అంటాడు. దీంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిని శపించి వెళ్లి పోతాడు. దీని తర్వాత బలిచక్రవర్తి పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకొని, వామనుడు కోరిన కోరిక మేరకు మూడు అడుగుల దానం ఇస్తున్నానని ప్రకటిస్తూ కలశం తో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లను పోసుకుంటాడు.

ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశానికి రంద్రం చేస్తాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్శపుల్లతో రంధ్రాన్ని పోడవగా తనకున్న రెండు కళ్ళలో ఒక కన్ను కోల్పోతాడు. అలా దాన్ని కోరిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ లోకమంతా ఆక్రమించేస్తాడు.. ఒక అడుగు భూమి మీద మరొక అడుగు ఆకాశం మీద వేస్తాడు.. ఇక మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. దీంతో బలిచక్రవర్తి నా తలపై వేయి అంటూ తల వంచుతాడు . దీంతో వామనుడు తన మూడవ అడుగును బలి నెత్తి పైన వేసి అదః పాతాళానికి తొక్కేస్తాడు. ఈ విధంగా వామనుడు అడిగిన మూడు అడుగుల వెనక అర్థం ఉంటుంది.

Advertisement

also read:చిరిగిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Latest Posts

  • టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?
  • చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?
  • మెగాస్టార్ “మాస్టర్” సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?
  • ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?
  • “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd