• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ప్రధాని సుడిగాలి పర్యటనలు.. మూడురాష్ట్రాల్లో!

ప్రధాని సుడిగాలి పర్యటనలు.. మూడురాష్ట్రాల్లో!

Published on November 20, 2022 by Idris

Advertisement

ప్రధాని మోడీ మూడు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఇంకోవైపు రాజకీయ సభకు హాజరయ్యారు. ముందుగా అరుణాచల్‌ ప్రదేశ్ లో తొలి ‘గ్రీన్ ఫీల్డ్’ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. రాజధాని ఈటానగర్‌ లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన డోనీ-పోలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ లో తొలి ఎయిర్‌ పోర్టు అందుబాటులోకి వచ్చింది. 2019 నవంబర్‌ లో ప్రధాని మోడీ ఈ గ్రీన్‌ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.645 కోట్లతో ఎయిర్‌ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది.

Advertisement

Advertisement

ఈటా నగర్ నుంచి వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్లారు మోడీ. అక్కడ కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ఆయన పంచె కట్టులో హాజరయ్యారు. తమిళనాడు, కాశీ మధ్య సంబంధాలను బలపరిచేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీ పంచె కట్టులో ప్రత్యేక విమానం నుంచి దిగి నడుస్తూ వస్తున్న ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎక్కడికి వెళ్లినా స్థానికత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ చేసుకుని అందరినీ ఆకట్టుకుంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ మోడీ పాల్గొన్నారు. వాపిలోని కట్టుదిట్టమైన భద్రత నడుమ రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ ర్యాలీతో వాపి రోడ్ జనంతో కిక్కిరిసంది. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌ లోని వల్సాద్ జిల్లాలో భారీ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. గుజరాత్‌, బీజేపీ మధ్య బంధం విడదీయరానిదని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ర్యాలీ పాల్గొనడంతోనే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిపోయిందన్నారు. ఈ జనసంద్రమే బీజేపీ విజయాన్ని చాటిచెబుతోందని తెలిపారు.

Related posts:

జైల్లోనే చార్లెస్.. ఎవరితను? ఏం చేశాడు..? కాలిపోతున్న కారులోంచి రిషబ్ పంత్ ని ప్రాణాలతో కాపాడింది ఎవరో తెలుసా..? వెండితెరపై వీరసింహం.. మనవడి ముందు బాలసింహం! డీజీపీ ఆఫీస్ ముట్టడించిన వారికి షాక్..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd