Advertisement
వర్షం పడుతున్న సమయంలో ఉరుములు,పిడుగులు, మెరుపులను చూసి కొంతమంది భయపడు తుంటారు. కొంతమంది ఆ మెరుపులను చూస్తూ ఆనందపడతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మెరుపుల నుంచి వచ్చే పిడుగుపాటు వలన కొన్ని వేల మంది మరణిస్తున్నారు. లక్షల మంది గాయపడ్డారు. పిడుగు అనేది ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే, సూర్యుడి ఉపరితలం మీద 5770 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
Advertisement
కానీ పిడుగు పడ్డప్పుడు మెరుపు కి ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే దాదాపు 29000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే సూర్యుడి కన్నా ఐదు రెట్లు ఎక్కువ వేడి ఉంటుందన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకి వందకు పైగా పిడుగులు పడుతున్నాయి. కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పిడుగుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం..?
Advertisement

అయితే ఏవైనా రెండు మేఘాలు దగ్గరికి వచ్చినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ కణాలు కలుసుకోవడం వల్ల అక్కడ మెరుపు ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి మేఘాల అడుగు భాగంలో ఉన్న నెగిటివ్ ఛార్జి కణాలు భూమ్మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ కణాలతో ఎట్రాక్ట్ చేసుకుంటాయి. దీనికోసం భూమ్మీద ఎత్తైన ప్రదేశం అది చెట్టయినా కావచ్చు, పర్వతం అయినా కావచ్చు, లేదా మనిషి అయినా కావచ్చు. వీటి ద్వారా ఈ బాండింగ్ జరిగి అటువంటప్పుడు అక్కడ పెద్ద మెరుపు వస్తుంది. దీన్నే పిడుగు అని పిలుస్తారు.
also read;




