• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » తిరుమల శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరం పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం..!!

తిరుమల శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరం పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం..!!

Published on October 4, 2022 by mohan babu

Advertisement

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి తిరుమల శ్రీవారి గురించి గురించి భక్తులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు..అదేంటో మనం చూద్దాం.. పురాణ కథల ప్రకారం తిరుమలేశుని భక్తులలో అనంతాళ్వారు స్వామి అగ్రగణ్యుడు. ఇతడు నిత్యం స్వామివారిని పూజిస్తూ ధ్యానంలో ఉండేవారు. ఈయన ప్రతి రోజు స్వామివారి పూలను సమర్పిస్తూ సేవలో ఉంటూ దర్శించుకునే వారు. ప్రతిరోజు తెచ్చే పూలతోటను మరింత పెంచాలని అనంతాళ్వార్ నిశ్చయించుకుంటాడు. తోట పెంచాలంటే నీరు కావాలి.. కాబట్టి ఆయన తన తోటలో చెరువు తవ్వాలి అని భావిస్తాడు.

Advertisement

దీంతో అనంతాళ్వార్ అతని భార్య ఇద్దరూ కలిసి చెరువు తవ్వడం మొదలుపెడతారు. కానీ ఆ సమయంలో అనంతాళ్వార్ భార్య నిండు గర్భిణీ. అతను గడ్డపారతో మట్టి తీస్తుంటే, భార్య మట్టిని గంపలో వేసుకొని దూరంగా వేసేది. గర్భిణీ కావడంతో ఆ పని చేయడానికి చాలా ఇబ్బంది పడి అలసి పోయేది. ఈ తతంగాన్ని గమనించిన శ్రీ వేంకటేశ్వరుడు 12 సంవత్సరాల బాలుడు రూపంలో అనంతాళ్వార్ దగ్గరికి వెళ్లి సహాయం చేస్తానని అడిగితే ఆయన ఒప్పుకోడు. కానీ భార్య ఒప్పుకోవడంతో ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు ఆ బాలుడు. దీన్ని గుర్తించిన అనంతాళ్వార్ తన భార్యను ప్రశ్నిస్తే, ఆ బాలుడు సహకారం అందిస్తున్నారని భార్య భర్త కు తెలుపుతుంది.

Advertisement

ALSO READ:ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు డైరెక్టర్ గారు.. !

దీంతో కోపానికి వచ్చిన అనంతాళ్వార్ చేతిలో ఉన్న గునపంతో ఆ బాలుడు మీదకి విసురుతాడు. ఆ గునపం బాలుడి గడ్డానికి తగలడంతో తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. దీంతో ఆ బాలుడు అక్కడినుంచి ఆనంద నిలయానికి మాయమవుతాడు. ఆలయంలో గర్భగుడి నుంచి రక్తం కారడం చూసి ఆలయ అర్చకుడు ఆశ్చర్యపోతాడు. ఈ విషయం అర్చకులు అనంతాళ్వారు కు చెప్పగా కంగారుగా అక్కడికి చేరుకొని, శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారడాన్ని గమనించి తనకు సహాయం చేయడానికి వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అని భావిస్తాడు. తాను తప్పు చేశారని భావించి కన్నీరుమున్నీరవుతూ స్వామివారి పాదాలను తాకుతాడు. ఇక అప్పటి నుంచి గాయం అయిన చోట గంధం పూసి పచ్చ కర్పూరం పెట్టడం ప్రారంభమైంది.

ALSO READ:

  •  మీ పిల్లలకు పేర్లు పెట్టాలా.. ఈ 3 అక్షరాలతో పెడితే చాలా అదృష్టం..!!

Related posts:

హ‌నుమాన్ జ‌యంతిని సంవ‌త్స‌రానికి రెండు సార్లు ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా..? తిరుమలలో ఉన్న ఈ మార్గాన్ని “శ్రీవారి మెట్టు” అని ఎందుకు పిలుస్తారు ? దాని యొక్క విశిష్టత గురించి తెలుసా.. ? ఇంట్లో భార్య, భర్తలు ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలి? దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd