• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!

చంద్రబాబుకి జగన్ ప్రభుత్వం మరో షాక్.. సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్..!

Published on September 30, 2023 by anji

Advertisement

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అక్టోబర్ 03న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ముందుకు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. సుప్రీంకోర్టు గత తీర్పులు, ఈ కేసులో సాంకేతిక అంశాలు దృష్ట్యా సానుకూల తీర్పు వస్తుందని.. చంద్రబాబు తరపు న్యాయవాదులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కేవీయట్  పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement

ముఖ్యంగా  చంద్రబాబు పై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.  కింది కోర్టులో చుక్కెదురైన వారు హైకోర్టును ఆశ్రయిస్తారు.. కింది కోర్టులో గెలిచిన వారు హైకోర్టులో కేవీఎల్ పిటిషన్ దాఖలు చేస్తారు. కేవీఎట్ అంటే.. కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీస్ ఇచ్చి కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. వారి వాదనలను కోర్టు వినాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. 

Advertisement

ఇవి కూడా చదవండి:  భువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?

 

కేవీయట్ పిటిషన్ వ్యాలిడిటీ కేవలం  మూడు నెలలు మాత్రమే ఉంటుంది. చంద్రబాబు కేసు విచారణను జగన్ ప్రభుత్వం అడ్డగించే ప్రయత్నాలు చేస్తోంది.  ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని.. అరెస్ట్ చేయడంలో  సైతం నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంటుంది. మొత్తానికి అక్టోబర్ 03న బలమైన వాదనలు వినిపించే అవకాశం ఉంది. మంగళవారం రోజంతా విచారణ జరిగే అవకాశముందని సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. 

ఇవి కూడా చదవండి :  కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!

Related posts:

వయస్సు కేవలం నెంబర్ మాత్రమే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు chandrababu-lawyersChandrababu: చంద్రబాబు విషయంలో లాయర్లు తప్పు చేశారా ? సీబీఐ మాజీ డైరెక్టర్ ఏమన్నారంటే..? ntr-TDPJr NTR: చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ? Default Thumbnailభువనేశ్వరి ఆస్తి విలువ అన్ని కోట్లా..? 2 శాతం విలువ చెప్పి చిక్కుల్లో పడిందా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd