• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్.. రాపాక!

ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్.. రాపాక!

Published on March 26, 2023 by Idris

Advertisement

2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి గెలిచారు రాపాక వరప్రసాద్. కానీ, కొన్నాళ్లకు పవన్ కు ఝలక్ ఇచ్చి వైసీపీ పంచన చేరారు. ఆ సమయంలో ట్రెండింగ్ లో ఉన్న పేరు మళ్లీ ఇన్నాళ్లకు హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్యే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా ముగిశాయి. టీడీపీకి తక్కువ స్థానాలు ఉండడంతో ఒక సీటు కచ్చితంగా దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. వైసీపీపై తిరగబడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకే ఓటేశారు. అయితే.. అనూహ్యంగా మరో రెండు ఓట్లు ఎగస్ట్రాగా పడ్డాయి. దీంతో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలిచారు.

Advertisement

tdp Powerful Counter to MLA Rapaka Varapraprasad

ఎన్నికల ప్రక్రియ అంతా అయిపోయి రెండు రోజులు పైనే అయింది. అయితే.. రాపాక సెన్సేషనల్ కామెంట్స్ తో ఎమ్మెల్సీ ఎన్నికలపై మళ్లీ చర్చ జోరందుకుంది. మొదట టీడీపీ తనతో బేరసారాలు జరిపిందని ఆరోపించారు వరప్రసాద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు అమ్ముకుంటే పది కోట్లు వచ్చేవని తెలిపారు. ఈ ఆఫర్ ను పార్టీ పైన ఉన్న గౌరవం, నమ్మకంతో వదిలేశానని వెల్లడించారు. రాజోలులో జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన ఈ విషయాల్ని బయటపెట్టారు.

Advertisement

ఇక్కడ రాపాక వ్యాఖ్యల వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్లిన ఈయనకు నియోజకవర్గంలో పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఆయనకు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో టీడీపీ బేరసారాలు ఆడినా.. తాను లొంగలేదు అనే డ్రామా క్రియేట్ చేసి జగన్ ను కాకా పట్టే ప్రయత్నంలో ఉన్నారా? అనే డౌట్ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

మరోవైపు రాపాక వ్యాఖ్యలపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయన చిల్లర మనిషి అని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన వైసీపీకి అమ్ముడు పోయిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత.. వైసీపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. అయినా, రాపాకను కొనాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా గెలవడానికి 22 ఓట్లు చాలు అని.. తమకు 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయన్నారు. తాడేపల్లి స్క్రిప్ట్‌ ని వరప్రసాద్ చదువుతున్నారని ఆరోపించారు. ఆయనకు రూ.10 కోట్లు కాదు కదా.. రూ.10 వేలు కూడా ఎక్కువే అని ఎద్దేవ చేశారు బోండా ఉమ.

Related posts:

ఎమ్మెల్యేకి ‘కొడుకు’ పోటు! బాలయ్యలా మీసం మెలేసిన లోకేష్ Pawan Kalyan With Formers Rights Organisationరైతులకు సాయంలో కూడా కులమేనా? CM KCR Master Plan For Vishaka Steel Plantబీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ నినాదం లాభమా? నష్టమా?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd