• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » హెల్మెట్ తో అత్తగారింటికి వెళ్లిన కోడలు.. అక్కడ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హెల్మెట్ తో అత్తగారింటికి వెళ్లిన కోడలు.. అక్కడ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Published on June 2, 2023 by anji

Ads

సాధారణంగా అత్త-కోడళ్లు చాలా వరకు తల్లి కూతుర్ల మాదిరిగా ఉంటారు.కానీ కొందరూ మాత్రం శత్రువుల మాదిరిగా ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. ప్రతీ చిన్న విషయానికి కూడా గొడవ పడటం చూస్తుంటాం. గోటితో పోయేదాన్ని కొందరూ అత్తా కోడళ్లు గొడ్డలి వరకు తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో కొందరూ పంతానికి పోయి ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కొకొల్లలు. తాజాగా తమిళనాడులో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ కోడలు ఏకంగా తన అత్తను దారుణంగా కొట్టి చంపింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలు అత్తను కోడలు చంపడానికి కారణం ఏంటి ? ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులో తిరునల్వేలి జిల్లా తులుకార్కులం పరిధిలోని వడుకనపట్టి గ్రామంలో షణ్ముగవేల్, సీతారామలక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు రామస్వామి కలడు.   రామస్వామి-మహాలక్ష్మీ కి ఐదేళ్ల కిందట పెళ్లి అయింది. పెళ్లి జరిగినప్పటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగా సాగుతూనే వచ్చింది.అయితే కోడలు మహాలక్ష్మీకి అత్త సీతారామలక్ష్మీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేవిధంగా తయారైంది. వీరు  ప్రతీ చిన్న విషయానికి గొడవ పడటం.. ఒకరిపై ఒకరు మాటలను తూటాల్లా పేల్చుకునే వారు. ఈ వ్యవహారం చాలా కాలం నుంచి కొనసాగుతూనే వస్తుంది. కోడలు పోరు పడలేక అత్త సీతారామలక్ష్మీ కొడుక్కి సపరేట్ ఇల్లు కట్టించింది. వీరి మధ్య కాస్త దూరం పెరిగినా వైరం మాత్రం తగ్గలేదు. ఇటీవలే అత్తకోడళ్లు మరోసారి గొడవపడ్డారు.

Advertisement

క్షణికావేశంలో ఊగిపోయిన కోడలు మహాలక్ష్మీ అత్త సీతారామలక్ష్మీని ఎలాగైనా ప్రాణాలతో లేకుండా చేయాలని భావించి స్కెచ్ వేసింది. సోమవారం తెల్లవారుజామున అత్త నిద్రిస్తున్న సమయంలో కోడలు హెల్మెంట్ ధరించి అత్త ఇంట్లోకి వెళ్లింది. వెళ్తూ.. వెళ్తూనే అత్త తలపై కర్రతో బలంా బాదింది. ఈ దాడిలో అత్త సీతారామలక్ష్మీ రక్తపు మడుగులో పడిపోయింది. ఆమె వద్ద ఉన్న నగలను సైతం తీసుకెళ్లింది మహాలక్ష్మీ. దొంగలు నగలు దోచుకెళ్లారని.. అందుకే చంపారని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ సీతారామలక్ష్మీ మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తొలుత దొంగలు ఈ పని చేశారని పోలీసులు అనుమానించారు. అత్తను కోడలే *త్య చేసిందని అనుమానించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయాన్ని అంగీకరించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. 

మరికొన్ని ముఖ్య వార్తలు : 

 వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఆ దర్శకుడేనా ? 

దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?

పేరేంట్స్ తో ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే ?

Related posts:

పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. ఈవెంట్స్ నిర్వహించే ప్లేస్ లు ఇవే మీకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా..అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి..!! 10 ఏళ్ల క్రితం పెళ్లయింది..2 పిల్లలు..అలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందో..!! తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూస్తున్నారని యువతి ఏం చేసిందో తెలుసా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • సూర్యకుమార్ యాదవ్ గురించి రాహుల్ ద్రవిడ్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  • ఓ చోట తప్పించుకుంటే.. మరోచోట కాటేసిన మృత్యువు.. అసలేం జరిగింది అంటే..?
  • ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
  • బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
  • డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd