• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

Published on September 18, 2022 by mohan babu

Advertisement

శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఐదవ అవతారం మరియు మొదటి అవతారం వామనుడు.. ఈ వామనుడు అతిథి గర్భాన జన్మించిన వ్యక్తి. మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు.. వైరోచకుని కుమారుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు. బలి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు. ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు. ఆ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ దశమి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు. ఈ విధంగా బలిని అణచివేసే సమయం కోసం ఎదురు చూడ సాగాడు. అయితే ఒకసారి బలి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తోంది.

Advertisement

 

also read:పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారో మీకు తెలుసా.. ఏ నెంబర్ ఉన్న పండ్లు మంచివంటే..?

Advertisement

బలిని తొక్కడానికి ఇదే సరైన సమయంగా విష్ణుమూర్తి చిన్నారి బ్రాహ్మణుడు వామనుడి రూపంలో యాగశాల వద్దకు వెళ్తాడు. దీంతో బలిచక్రవర్తి ఆ వామనుడికి సాదర స్వాగతం పలికి నీకు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. తమకు యాగం చేసుకోవడానికి మూడు అడుగుల నేల కావాలని కోరతాడు. దీంతో బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం అడుగుతున్నా అతడు వామన రూపంలో ఉన్నటువంటి రాక్షస విరోధి అయిన మహా విష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కనిపెడతాడు. ఇదే విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు. కానీ అప్పటికే ఆయన మాట ఇచ్చేశానని, ధనం మరియు ప్రాణం మీద వ్యామోహంతో మాట వెనక్కి తీసుకోలేనని అంటాడు. దీంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిని శపించి వెళ్లి పోతాడు. దీని తర్వాత బలిచక్రవర్తి పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకొని, వామనుడు కోరిన కోరిక మేరకు మూడు అడుగుల దానం ఇస్తున్నానని ప్రకటిస్తూ కలశం తో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లను పోసుకుంటాడు.

ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశానికి రంద్రం చేస్తాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్శపుల్లతో రంధ్రాన్ని పోడవగా తనకున్న రెండు కళ్ళలో ఒక కన్ను కోల్పోతాడు. అలా దాన్ని కోరిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ లోకమంతా ఆక్రమించేస్తాడు.. ఒక అడుగు భూమి మీద మరొక అడుగు ఆకాశం మీద వేస్తాడు.. ఇక మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు. దీంతో బలిచక్రవర్తి నా తలపై వేయి అంటూ తల వంచుతాడు . దీంతో వామనుడు తన మూడవ అడుగును బలి నెత్తి పైన వేసి అదః పాతాళానికి తొక్కేస్తాడు. ఈ విధంగా వామనుడు అడిగిన మూడు అడుగుల వెనక అర్థం ఉంటుంది.

also read:చిరిగిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Related posts:

తొలి ఏకాదశి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు.. లేదంటే..? శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం ఈ పూజ చేస్తే అష్టైశ్వర్యాలే..!! చాణక్య నీతి : భర్తకు భార్య చెప్పని రహస్యాలు ఇవే! ఆదివారం మాంసం ఎందుకు తినకూడదో తెలుసా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd