• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Uncategorized » TTDకీ 3 కోట్లు జరిమానా వేసిన కేంద్రం.. జరిగిందేంటంటే..!!

TTDకీ 3 కోట్లు జరిమానా వేసిన కేంద్రం.. జరిగిందేంటంటే..!!

Published on April 5, 2023 by mohan babu

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే ఎంతో పేరుగాంచిన దేవాలయం. ఇక్కడికి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు కూడా వస్తుంటారు. అలాంటి టీటీడీకి కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల జరిమానా విధించింది. మరి ఎందుకు విధించిందో ఇప్పుడు చూద్దాం.. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి హుండీలో ఎంతోమంది భక్తులు ఖరీదైన కట్న కానుకలు వేస్తూ ఉంటారు. భక్తులు ఎంత అమౌంట్ వేసినా ఏది వేసిన లెక్కలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో విదేశీ భక్తులు కూడా తిరుపతికి వచ్చినప్పుడు హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. ఇందులో చాలామంది విదేశీ కరెన్సీ కూడా సమర్పిస్తారు.

Advertisement

ALSO READ: బండి సంజయ్ అరెస్ట్ అటు రిమాండ్.. హైడ్రామా!

Advertisement

అయితే అలా వచ్చిన విదేశీ కరెన్సీని టీటీడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భారత కరెన్సీ లోకి మార్చుకుంటూ వచ్చేది. కానీ 2018 తర్వాత ఈ కరెన్సీ ని అలా మార్చుకోవడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించలేదు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ కరెన్సీని టిటిడి ఖాతాలో డిపాజిట్ చేయడానికి కూడా అంగీకరించలేదు. దీంతో 2018 నుంచి ఇప్పటివరకు ఆ విదేశీ కరెన్సీ పెద్ద మొత్తంలో పేరుకుపోయింది. ఇప్పుడున్న డబ్బు విలువ దాదాపుగా 30 కోట్లకు పైగానే ఉంటుందని టిటిడి చెబుతోంది.. అయితే 2018 వరకు విదేశీ భక్తులు వేసే విరాళాలను పొందడానికి టీటీడీ హోంశాఖ నుంచి FCRA చట్టం కింద లైసెన్స్ పొందింది. FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ ( రెగ్యులేషన్ ) యాక్ట్, 2010. ఈ చట్టం కింద విదేశీ కరెన్సీని RBI ఆర్బిఐ 2018 వరకు అనుమతించింది. అలా వచ్చిన డబ్బును ఎస్బిఐ కూడా టిటిడి ఖాతాలో జమ చేసేది.

కానీ 2018 తర్వాత లైసెన్స్ గడువు ముగిసిన టీటీడీ వారు దాని రెన్యువల్ చేసుకోలేదు. దీన్ని గుర్తించిన కేంద్ర హోంశాఖ ఎఫ్ సిఆర్ ఏ విభాగం 2019లో గుర్తించింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోకుండా టీటీడీ విదేశీ కరెన్సీ ద్వారా విరాళాలు సేకరించడం మీద రూ.1.14 కోట్ల జరిమానాను విధించింది. దీని ప్రకారం విదేశీ విరాళాల పై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు ఉపయోగించరాదు. కానీ టీటీడీ బోర్డు ఆ మొత్తాన్ని వినియోగించడం, ఆ వివరాలను సరైన ఫార్మాట్లో ఇవ్వకపోవడం వల్ల కేంద్రం రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీనివల్ల కేంద్రం టిటిడి పై మొత్తం విధించిన జరిమానా రూ.4.33 కోట్లకు చేరుకుంది.

ALSO READ:ఇతరుల శరీరం నుండి వచ్చే వాసన ఇంత ప్రమాదమా..?

Related posts:

తమిళనాడు సీఎంలు.. నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరిస్తారంటే..? 10 ఏళ్ల క్రితం పెళ్లయింది..2 పిల్లలు..అలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందో..!! పెళ్లయిన నాలుగు నెలలకే ప్రియుడితో పరార్.. కానీ చివరకు..!! కుమారుడి బర్త్ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన వైఎస్ షర్మిల..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd